Monday, May 16, 2011

దిబ్బపాలెం దిబ్బ,గంగవరం గల్లంతు ఆహా!!! ఏమి దైవ భక్తి. శెభ్హాష్.









గంగవరం పోర్ట్ అభివృద్ధి పేరుతో దిబ్బపాలెం,గంగవరం గ్రామాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం,ఈనాటికి ఆ రెండు గ్రామాల నిర్వాసితులను రోడ్లమీడదే  బతకమంటూంది.


గంగవరం పోర్ట్ కాంట్రాక్టర్ ఎంత మిగుల్చుకున్నాడో కానీ బెజవాడ దుర్గకి 40 లక్షల విలువైన బంగారు హారం సమర్పించాడంట.

రెండు గ్రామాలకు చెందిన వేలాదిమంది కూడూ,గూడూ కోల్పోయి ఏడుస్తుంటే,ఇస్తామన్న ఉద్యోగాలూ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతుంటే,కాంట్రాక్టర్ గారి ఔదార్యం అబ్బో ఎంత వెగటు పుట్టిస్తుందో!!!!!


3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మానవ సేవే మాధవసేవ ..అన్నది ఇక్కడ వర్తించదు అనుకోవాలి .. అభివృద్ధి పేరిట జనజీవితాలని ఇక్కట్లపాలు చేసి.. లాభాలు ఆర్జించి "అమ్మకి" లంచం అన్నమాట."అమ్మ" ఎక్కడైనా ఇలాటి వారిని హర్షిస్తుందా !? ఇలాటి వాటిని గొర్రెలమందలాటి జనం దృష్టికి తీసుకువస్తున్న మీకు అభినందనలు...ధన్యవాదములు.. చెప్పగా చెప్పగా ,చూడగా చూడగా..అయినా ఆలోచనా విధానం లో.. మార్పు వస్తుంది..మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తూ.. మీ నుండి ఎంతో..నేర్చుకుంటూ

ఆత్రేయ said...

వాడి జిమ్మడి పోనూ అని నేననుకుంటుంటే
ఈ ప్రభుత్వం పడి పోనూ అని ఇంకోఆయన అనుకుంటున్నాడు
ఏది జరిగినా ఆ నిర్వాసితుల బ్రతుకులు మారేనా ..?
జనం సొమ్ము తిన్న వాడూ బానే ఉన్నాడు
అమ్మ కిరీటం తిన్న వాడూ బానే ఉన్నాడు
పాపభీతి అంటే ఏంటో ??

Praveen Mandangi said...

పాపభీతి ఏ అవినీతిపరుడికి ఉంది? పది లక్షలు భోంచేసి పదివేలు హుండీలో వేస్తారు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...