Wednesday, March 23, 2011

భూమిక హెల్ప్ లైన్ ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర జ్యోతి లో వచ్చిన ఆర్టికల్

                                             

TV9 naveena exhibition photo

భూమిక హెల్ప్ లైన్ ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర జ్యోతి లో వచ్చిన ఆర్టికల్ మీ కోసం.

https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/mar/22/navya/22navya1&more=2011/mar/22/navya/navyamain&date=3/22/2011

Tuesday, March 22, 2011

ఈ నవ్వుల వెనక ఏమున్నదో ???- శ్రీవిద్య సెంటర్ వివరాలు

శ్రీవిద్య సెంటర్ నిర్వాహకులు శాంతి గారు.
ఇంటి నెంబరు 10-3
ఈష్ట్ మారేడ్ పల్లి
సికందరాబాద్
ఫోన్ నంబర్
040-2773451 సెల్: 9490439801
shanthi@srividhyaschool.com
www.srividhyascool.com
www.srividhya.org

Saturday, March 19, 2011

వెన్నెల్లొ హాయ్ హాయ్-సూపర్ డూపర్ చాంద్



అబ్బ! చంద్రుడు నిజంగానే సూపర్గున్నాడు.
ఏమి వెన్నెల కురిపిస్తున్నాడు.ఎంత హొయలు పోతున్నాడు.
తిలక్ అమృతం కురిసిన రాత్రి ఇల్లాంటి చంద్రుణ్ణే చూసి ఉంటాడు.
లాహిరి లాహిరి పాటలో కూడా ఇలాంటి చంద్రుడే.
నేను లఢాఖ్ లోని లేహ్ కొండల్లో చూసింది ఇలాంటి చంద్రుణ్ణే.
మా సీతారామపురంలో ఆరుబయట మంచాలేసుకుని పడుకునే రోజుల్లొ ప్రతి పున్నమికి చూసింది ఇల్లాంటి చంద్రుడినే.
టాంక్ బండ్ మీద ఫోటో తియ్యబోతే ఇదిగో ఇలా బంగారు రంగు జీళ్ళపాకంలా వచ్చింది ఓ ఫోటో.
కావాలంటే చూడండి.

Friday, March 18, 2011

ఈ నవ్వుల వెనక ఏమున్నదో ????











నిన్న నేను అడ్డగుట్టలో ఉన్న మానసిక ఎదుగుదల సరిగా లేని పిల్లలు చదువుకుంటున్న స్కూల్ చూడడానికి వెళ్ళాను.
శాంతి గారు నడుపుతున్నారు ఈ సంస్థని.
వాళ్ళ అమ్మ గారు పిల్లలకి వండిపెడతారు.
ఈ ప్రత్యేక పాఠశాల గురించి తర్వాత వివరంగా రాస్తాను.
అక్కడ దాదాపు 140 మంది మానసికంగా ఎదగని పిల్లలున్నారు.3 సంవత్సరాల నుండి 58 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఉన్నారు.
ఎవ్వరూ వాళ్ళ పని చేసుకోలేరు.
బాత్ రూం కి కూడా వెళ్ళాలని తెలియదు.
టాయ్ లెట్ వస్తుందని కూడా చెప్పలేరు.
ఇక అమ్మాయిలు పీరియడ్ సమయంలో కూడా మానేజ్ చేసుకోలేరు.
వీళ్ళకి సేవ చేసే ఆయాలు, చదువు చెప్పే టీచర్లు ఉన్నారు.
శాంతి గారు పిల్లల్ని తనతోనే ఉంచుకుంటారు.
వాళ్ళ ఇల్లే స్కూల్,హాష్టల్.
ఏప్రిల్ 9 న ఈ ప్రత్యేక స్కూల్ కోసం ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు రవీంద్రభారతిలో.
దీని వివరాలు మళ్ళీ ఇస్తాను.
ఈ స్కూల్ కి ప్రభుత్వ సహాయం అందడం లేదట.
ఆ పిల్లల నవ్వుల్ని మర్చిపోలేక పోతున్నాను.
ఎంత హాయిగా నవ్వుతారని.
ఈ స్కూల్ కి ఎవరైనా సహాయం చేయ దలిస్తే వివరాలు ఇస్తాను.
మనందరి సహాయం చాలా అవసరం శాంతి గారికి.
మెదడు వికసించని ఈ పిల్లల కోసం పెద్ద మనసుతో స్పందించాల్సిందిగా విజ్ఞప్తి.

Wednesday, March 16, 2011

8 మీద నడక ఎంతొ పవర్ ఫుల్

8
ఈ మద్య్హ ఒక ఫ్రెండ్ ఎనిమిది మీద నడిచి చూడు చాలా బావుంటుంది అంది.
ఫ్రెండ్స్ చెప్పింది వినాలి కదా అని ఓ రోజు మా ఇంటి ఆవరణలో ఓ పెద్ద ఎనిమిది అంకె గీసి దాని మీద నడిచాను.
బావుందనిపించింది.
మర్నాడు ఎఫెం వివిధభారతి లో పాటలు పెట్టుకుని ఎన్మిది మీద అరగంట నడిచాను.
ఒకే రిధంలో వంకరలు తిరుగుతూ నడవడం బావుంది పది నిమిషాల్లో చెమటలు పట్టాయి.
ప్రయత్నిచి చూడండి.
హాయిగా పాత పాటలు వింటూ,బయటకెక్కడికో వెళ్ళకుండా నడవొచ్చు.

ఆల్ ది బెస్ట్.

Monday, March 14, 2011

మళ్ళొకసారి మార్చి 8 ని తలచుకుంటూ....




మార్చి ఎనిమిది సమీపిస్తుందంటే ఒక ఉత్సాహం, ఒక సంతోషం మనసంతా కమ్ముకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఎన్నో సమావేశాలు. రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా ఆహ్వానాలు. ఆదోని రమ్మని ఉషారాణి, కాకినాడ రమ్మని అబ్బాయి, చేనేత మహిళల మీటింగ్‌లో పాల్గొనమని నిర్మల, పాడేరులోని అరణ్యక మీటింగ్‌కి రమ్మని మాలిని, ఆఖరికి నేను అనంతపూర్‌ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు ఈ సంపాదకీయం చదివేసరికి మార్చి ఎనిమిది సంబరాలు ముగిసిపోతాయి కూడా.
నగరంలో కూడ లెక్కలేనన్ని మీటింగులు జరుగుతాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా మార్చి ఎనిమిదిన మహిళల అంశాలపై, మహిళల సమస్యలపై చర్చోపచర్చలు జరుగుతాయి. కొందరు పోరాట దినంగా జరిపితే, కొందరు ఉత్సవంలా, ఉల్లాసంగా జరుపుతారు. వందేళ్ళ చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది ఎన్నో పోరాటాల్ని, మహిళల ఆరాటాల్ని, ఆర్తనాదాల్ని తనలో ఇముడ్చుకుంది. వాటన్నింటినీ గుర్తు చేసుకోవడానికి, గురి తప్పిన గమ్యాలను పునర్మినించుకోడానికి, మహిళా ఉద్యమానికి పునరంకితమవ్వడానికి మార్చి ఎనిమిదిని మించిన రోజు మరోటి లేదు.
అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ సందర్భంగా ముందుకొస్తున్నాయి. బీజింగ్‌ సదస్సు స్ఫూర్తితో మహిళలపై అన్ని రకాల వివక్షతను వ్యతిరేకంగా జరిగిన ఒప్పందం (సీడా) నేపధ్యంలో భారతదేశం మహిళల రక్షణ కోసం చాలా చర్యలను తీసుకుంది. కొత్త చట్టాలను చేసింది. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు (73,74 రాజ్యాంగ సవరణ) గృహహింస నిరోధక చట్టం 2005, లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010 లాంటివి వచ్చాయి. అయితే అసెంబ్లీ, పార్లమెంటుల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లు మొద్దు నిద్రలోనే జోగుతోంది. పనిస్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లును చట్టరూపంలో తేవడానికి అనవసర జాప్యం జరుగుతోంది. గృహహింస నిరోధక చట్టం కూడా దేశమంతా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు రక్షణాధికారులు వ్యవస్థ ఏర్పడనేలేదు. చట్టంవొచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయినా అమలులో ఎంతో నిర్లిప్తత, నిర్లక్ష్యం కనబడుతోంది. ఇంత నిర్లక్ష్యం క్షమించలేం. అలాగే ఈ చట్టం గురించిన ప్రచారం ప్రభుత్వం చేపట్టలేదు. ఒక పనికి ఆహారపథకం, ఒక పల్ప్‌పోలియో, ఒక ఆర్‌టిఐ చట్టం ప్రచారం కోసం నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం విషయంలో మాత్రం స్ట్రాటజిక్‌గా మౌనం వహిస్తోంది.
కొత్త చట్టాలొస్తున్నాయి. కొత్త కొత్త సపోర్ట్‌ సిస్టమ్స్‌ వెలుస్తున్నాయి. అయినాగానీ స్త్రీల మీద హింస ఏ మాత్రం తగ్గడం లేదు. స్త్రీలపై నేరాలు పెరుగుతున్నాయని సాక్షాత్తు జాతీయ నేర నిరోధక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయని లెక్కలేసి చెబుతున్నారుగానీ వాటి తగ్గుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదు. చట్టాలు చేసాం కదా అని చేతులు దులిపేసుకునే బండవైఖరి కన్పిస్తోంది కానీ చట్టాల సక్రమ అమలుకోసం జండర్‌ స్పృహతో ఆలోచిస్తున్న దాఖలాలు లేవు.
ఈ మార్చి ఎనిమిది సందర్భంలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అంశమొకటుంది. దేశ రక్షణకోసం సైన్యంలో చేరిన మహిళలకు జరుగుతున్న అన్యాయం. ఆర్మీలో కొనసాగుతున్న జండర్‌ వివక్ష. ఆర్మీలో పనిచేసే మహిళలకి పర్మినెంట్‌ ఉద్యోగాలివ్వకుండా 14 సంవత్సరాల దాకా టెంపరరీగా పనిచేయించుకుని ఎలాంటి పదవీవిరమణ సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి సాగనంపుతారని ఇటీవల సుప్రీంకోర్టుకొచ్చిన ఒక కేసు గురించి చదివినపుడు తీవ్ర దిగ్భ్రమను కల్గింది. అత్యంత గోప్యతను పాటించే ఆర్మీలో విషయాలు బయటకు రావడం చాలా కష్టం. కొంతమంది మహిళా అధికారులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ అంశం బయటకొచ్చింది. వీరిపట్ల కొనసాగుతున్న వివక్ష అంతర్జాతీయ ఒప్పందాలకు విరుధ్ధం. భారత రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచి చూడాల్సి వుంది.
మార్చి ఎనిమిదికి జేజేలు పలుకుతూ, మహిళా అంశాలను సమీక్షించుకోవడానికి మార్చి ఎనిమిది సమావేశ వేదికలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ…
అందరికీ అభినందనలు తెలుపుతూ…

http://bhumika.org/archives/1710



Sunday, March 13, 2011

చాపరాయ్ దగ్గర చెయ్యందించిన గిరిజన కుర్రాడు

ఓ పదేళ్ళ క్రితం మాట.

కొత్థగా డిప్యూటి తాహసిల్దార్ గా ఎంపికైన రోజులు.
కొత్త మితృలతో కలిసి వైజాగ్ ట్రిప్ వెళ్ళిన సందర్భం.
మా అమ్మ జీవించి ఉన్న రోజులు.అమ్మని కూడా నాతో తిప్పిన ట్రిప్ అది.
వైజాగ్,సిమ్హాచలం,అన్నవరం,పాడేరు,తలుపులమ్మ లోవ,ఏటికొప్పాక అన్నీ తిరిగేసి అరకుకు వెళ్ళేం.
అరకు నుంచి చాపరాయ్. భలే ఉంటుంది నీటి ప్రవాహం.
అందరం ఓ చోట ఆగి నీళ్ళల్లో పాదాలాడిస్తూ ఆడుకుంటున్నాం.
మా అమ్మ కారులోనే ఉండిపోయింది నేను దిగలేనని.
నాకు హఠాత్తుగా అటువేపు వెళ్ళాలనే వెర్రి ఆలోచన కలిగింది.
అంతే గబగబా నడుస్తూ నీళ్ళను దాటేసి అటువేపు వెళ్ళిపోయాను.
తీరా అటువేపు వెళ్ళాకా చూస్తే నీటి ప్రవాహం పెరిగిపోయింది.
తిరిగి రావడం చాలా కష్టమనిపించింది.
ఇటుపక్క నున్న వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు రమ్మని.
ఏం చెయ్యాలో అర్ధం కాక అటు ఇటు చూస్తుంటే అడవి కరివేపాకు కోస్తూ ఇద్దరు గిరిజన కుర్రాళ్ళు కనబడ్డారు
హమ్మయ్య ప్రవాహం దాటిస్తారు
లే అని ఓ  అబ్బాయి దగ్గరకెళ్ళీ
అడిగాను.మొదట నా మాట అర్ధం కాలేదు. చాలా సిగ్గుపడిపోయాడు మాట్లాడుతుంటే.
ఇటుపక్క మితృల గొడవ ఎక్కువైంది.ప్రవాహం పెరిగిపోతోంది రమ్మంటూ కేకలుపెడుతున్నారు.
ఈ కుర్రాడేమో రానంటున్నాడు తల అడ్డంగా తిప్పుతూ.
ఇంక చేసేదేమి లేక ఆ కుర్రాడి చెయ్యిపట్టుకున్నాను.
గబుక్కున లాగేసుకున్నాడు.నన్ను అటువేపు తీసుకెళ్ళమని సైగలు చేస్తూ మళ్ళి చెయ్యి పట్టుకుని బలవతంగా ప్రవహం వేపు లాక్కొచ్చాను.సిగ్గుపడుతూ,చెయ్యి విడిపించుకుంటూ మొత్తానికి నాతో వచ్చాడు.
నేనే లాక్కొచ్చాను.
ఇటువైపు వచ్చాకా అతనికి ఏ భాషలో కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కాలేదు.
తెలుగు రాదు.నమస్కారం పెడదామా అంటే చాలా చిన్నవాడు.
మొత్తానికి ఆరోజు నన్ను ప్రవాహం దాటించిన ఆ గిరిజ కుర్రాడు ఇప్పటికీ నా మనసులో మెదులుతున్నాడు.
డబ్బులిచ్చాం కానీ అతని సహాయం డబ్బులతో కొలిచేది కాదు.
ఇవతలి గట్టుకి రాగానే నా మితృలంతా తిట్టినతిట్ట్లు హమ్మో ఇప్పుడు గుర్తు చేసుకోకూడదు.
మా అమ్మ మాత్రం ఇదెప్పుడూ ఇంతే నీళ్ళు చూస్తే దీనికి వొళ్ళు తెలియదు అంటూ మురెపెంగా అంటుంటే మా వాళ్ళ ముఖాలు చూడాల్సిందే.

Saturday, March 5, 2011

టైడాలో జంగల్ బెల్స్ -తనువూ మనసూ తన్మయమైన వేళ




నేనో మూడు రోజులపాటు అన్ని శబ్దాలకూ దూరంగా కేవలం పక్షుల శబ్దాలను మాత్రమే వింటూ గడిపాననంటే మీరు నమ్ముతారా?

నమ్మాలి మరి.విశాఖ నుంచి అరకు అరకు నుంచి టైడా.
టైడా గురించి మీరు విన్నారా?
జంగల్ బెల్స్ గురించి విన్నారాపోనీ.
విశాఖ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అందమైన కొండలు లోయల మధ్య టైడా ఉంది.
ఏపి టూరిజంవాళ్ళు గొప్ప టేస్ట్ తో కట్టిన అథిధి గృహాల సముదాయం ఉంది.
దూరదర్శన్లు, దూరవాణులు పనిచెయ్యని ఏకైక ప్రదేశం.
గొప్ప నిశ్శబ్దం,చిక్కటి అడవి లో ఆ నిరామయ స్థితిని అనుభవించాల్సిందే.
నిండు అమావాస్య రోజున ఆ అడివి అందాన్ని నక్షత్రాల వెలుగులో చూడాల్సిందే.
చెవులు పగిలిపోయే నగర శబ్దకాలుష్యాన్ని భరిస్తున్న మనం
జంగల్ బెల్స్ లో కేవలం పక్షుల పాటలనే వినడం అబ్బో ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
ఫోన్ తోనే పుట్టినట్టు,టివీని మెళ్ళో వేసుకుని బతుకుతున్నట్టు
భ్రమ పడుతున్న జనాలకి అంతటి నిశ్శబ్దం భరిచడం కష్టమే.
ఉదయాన్నే ఎన్ని రకాల పక్షులు సామూహిక గాన కచేరి పెట్టాయని.
కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు చెవులు తన్మయమైపోతాయి.
జంగల్ బెల్స్ నా గుండెల్లో గణగణ మోగుతున్నాయ్.
ఇంతకన్నా రాయలేని,తనివితీరని స్థితిలో తరించిపోతూ....

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...