Friday, June 17, 2011

మనీషా ఆత్మ గౌరవం-చదువు కోసం ఆరాటం

ఓ నెల క్రితం ఆంధ్ర జ్యోతి నవ్య పేజీ లో మనీషా అనే అమ్మాయి గురించి భువనేశ్వరి అనే జర్నలిష్ట్ ఓ కధనం రాసింది.మనీషా గురించి చదివి నేను ఆ అమ్మాయిని కలిసాను.చూడ ముచ్చటగా ఉంది మనీషా. ఎంతో చురుకైంది.

భువనేశ్వరి ఏమి రాసిందంటే మనీషా వాళ్ళమ్మతో కలిసి చెప్పులు కుడుతుంది. వాళ్ళ నాన్న తాగుడు కోసం అప్పులు చేసి ఈ మధ్యనే చనిపోయాడు.చెప్పులు కుట్టడమే వాళ్ళ వృత్తి.అదే జీవనాధరం.చిన్న పిల్లవు కదా చదువుకోకుండా చెప్పులు కుడుతున్నావేంటి అని జర్నలిష్ట్ అడిగినపుడు నా స్కూల్ ఫీజు కోసమే చెప్పులు కుడుతున్నాను.నాకు పని ఇవ్వండి నా డబ్బు నేనే సంపాదించుకుంటాను.చదువుకుంటాను.అని చాలా ఆత్మ గౌరవంతో చెప్పింది.
ఆ మాటే నన్ను ఆ పిల్లని కలిసేలా చేసింది.చాలా మందిని కదిలించింది.అప్పట్లో చాలా మంది ఆ పిల్లని చదివిస్తామని ముందుకొచ్చారు.ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడటం లేదు అని చెప్పింది ఈ రోజు.
మనీషాకి దాదాపు 9000/- వేలు డొనేషన్ కట్టాలి.నెల నెలా ఫీజు ఎన్ టి ఆర్ ట్రష్ట్ వాళ్ళు కడతామని చెబుతున్నారు.
సోమవారం డొనేషన్ కట్టి ఆ పిల్లని కీస్ హై స్కూల్ లో 7 వ తరగతి లో జాయిన్ చేద్దామనుకుంటున్నాను.
ఎవరైనా మనీషాకి సహాయం చెయ్యదలుచుకుంటే భూమిక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పొచ్చు.(1800 425 2908)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...