Sunday, January 17, 2010

ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను


ఈ సంక్రాంతి కి నేను నా కిష్టమయిన పని చేసాను.
భోగి రోజు విజయవాడ నుండి వస్తూ బోలెడన్ని భోగి మంటలు చూసాను.
హఠాత్తుగా కురిసిన అకాల వర్షానికి కొన్ని భోగి మంటలు ఆరిపోతూ కనిపించాయి,
ఉవ్వెత్తున ఎగిసిపడిన ఇటీవలి ఉద్యామాలలా.
పెద్దపండగా రోజు నెక్లెస్ రోడ్ లో పతంగుల పండగ చూసి వస్తూ
వాల్దెన్ కి వెళ్లాను.నేను ఎంతోకాలంగా వెతుకుతున్న పుస్తకం కనబడి గొప్ప సంతోషం కలిగింది.
ఇటీవల శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయిన గోపీచన్దు గారి పుస్తకాల సర్వస్వం.
10 వాల్యూముల భండారం.మూడో వాల్యుం లో నాకిష్టమయిన "మెరుపులు మరకలు" నవల.
ఎన్నో సంవత్సరాలగా వెతుకుతున్న పుస్తకం.
1500 ఖర్చుపెట్టి పరమానందంగా ఇంటికి తెచ్చుకుని ఇదిగో మీకోసం ఈ ఫోటో తీశాను.
పండగరోజు పుస్తకం కొనడంలో గొప్ప ఆనందముంది.
మీరూ నాతొ ఏకీభవిస్తారని ఆసిస్తూ....

3 comments:

Anonymous said...

అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

http://telugusimha.blogspot.com/

oremuna said...

నేను కూడా చాశాను.
1500 కొనాలా వద్దా అని పది సార్లు ఆలోచించి
చదవకుండా కొని ఇంట్లో పెట్టిన 200 వరకు ఉన్న పుస్తకాలు కళ్ల ముందు కదిలి,
మళ్లా దొరుకుతాయో లేదు అని బాధ వేసి
చివరకు బొమ్మా బొరుసు వేసి కొనకుండా వచ్చాను. :)

ప్రేరణ... said...

నిజమే మంచిపని చేసారు...

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...