Monday, June 29, 2009
మా గోదావరి కధలు
మా మేనత్త గారి వూరు పేరు బూరుగులంక.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి ప్రవహించినత మేరా బోలెడన్ని లంకలున్నాయి.కనక్కాయల లంక,యలమంచిలి లంక,బూరుగు లంక,పుచ్చల్లంక ఇలా ఎన్నో అందమైన లంకలున్నాయి.నేను పైన చెప్పిన బూరుగు లంక మా మేనత్త అత్తగారి వూరు.ఈ వూరు వెల్లడానికి రెండు దారులున్నాయి. ఒకటి నరసాపురంలో పడవెక్కి గోదావరి దాటి దాటి సఖినేటిపల్లిలో బస్సెక్కి వెళ్ళడం. రెండోది పెనుగొండ మీదుగా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వెళ్ళడం.సిద్ధాంతం బ్రిడ్జి మీద నిలబడి చూస్తే కుడి వేపు,బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెల మధ్య చిన్న పాయలాగా పారే గోదావరి మలుపు తిరిగే చోట మా మేనత్త గారి బూరుగు లంక కనపడుతుంది.అచ్చమైన, అందమైన లంక.బూరుగు లంక మెడచుట్టూ నెక్లెస్ లా మెరుస్తుంటుంది గోదావరి.ఆ లంకలోకి వెళ్ళలంటే ఎవ్వరైనా సరే గోదావరిలో దిగి నడవాల్సిందే.ఎక్కువ లోతుండదు.ఆ చిన్న పాయలో పాదాలుంచి నడుస్తున్నపుడు చెప్పలేని ఉద్వేగం మనసును కమ్మేస్తుంది.తల్లి గోగారిని కాళ్ళతో తన్నుతూ నడవడం బాధగా అనిపిస్తున్నప్ప్టికి, నీళ్ళలో కాళ్ళు పెట్టగానే ఒళ్ళు జిల్లుమంటుంది.ఆ బుల్లి పాయను ధైర్యంగా దాటేసి, అఖండ గోదావరిని దాటేసినంత ఆనందంతో మా మేనత్త గారి వూరి వేపు నడక సాగిస్తాం.ఎంతో సారవంతమైన భూములు.కొబ్బరి తోటలు,అరటి,మొక్కజొన్న,తమలపాకు తోటలు.లంకంతా పరుచుకున్న పచ్చదనం గుండెను ఉప్పొంగిస్తుంది.గోదారమ్మ ఒడిలో కూర్చున్నట్ట్లుగా వుండే ఆ లంక అంటే నాకు ప్రాణం. వరద గోదారమ్మ ఉగ్రరూపంతో ఒరుసుకుంటూ ఆ లంకను తాకినపుడు లంకలో జనం విలవిల్లడిపోతారు.ప్రతి సంవత్సరం కొంత భూమిని తనలో కలిపేసుకున్నా మరో చోట సారవంతమైన భూమిని కూడ పసాదిన్స్తుంది.భద్రాచలం దగ్గర పెర్గే వరద సూచి పయింట్లు, ఈ లంక ప్రజల గెండె వేగాన్ని విపరీతంగా పెంచుతాయి.ఎతైన ప్రదేశాలు చూసుకుకి ఆ సురఖ్సిత ప్రాంతాలకు తరలిపోతారు.వరద తాకిడి, విధ్వంశం స్రుషిటించినా,వరదతో పాటు వచ్చే ఒంద్రు మట్టి ఆ సంవత్స్రం ఇబ్బడి ముబ్బడిగా పంటలిస్తుందని లంక జనానికి తెలుసు కాబట్టి వరద వేళ సుఖ దుఖాలను సమానంగానే అనుభవిస్తారు.ప్రతి సంవత్సరం వరద ఎంత ఎత్తు వచ్చింది,అని కొలుచుకోవడానికి ఇంటి గోడల మీద గుర్తులు పెడతారు.ఈ సంవత్సరం ఇంత ఎత్తు,క్రితం సంవత్సరం ఇంత ఎత్తు.అలాంటి గుర్తులు ప్రతి ఇంటి గోడ మీద వుంటాయి.వరద కధల్ని మా మేనత్త రసరమ్యంగా మా మేనత్త మాకు చెప్పేది. మేము ముగ్ధులమై వినేవాళ్ళం.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I...
4 comments:
ఎలా వున్నారు సత్యవతి గారూ?మేముండేది లంకల్లో కాదు గానీ మా అరుగు మీద కూడా వరద తాలూకూ గుర్తు వుంటుంది.
గుండె లోతుల్ని స్పృశిస్తూ చాలా బాగుందండీ మీ లంక వ్యాసం.
చాలా బాగుందండీ ,మాకు కూడా మీ ఊరు చూద్దామనిపిస్తుంది
సత్యాజీ ..మీ మేనత్త గారి కుటుంబం ఇంకా అక్కడే ఉన్నారా?
Post a Comment