Sunday, July 15, 2007



మా గుర్రం బండీ-మహేశ్వరం మామయ్య

ఈరోజు హిందూ పేపర్లో ఎద్దుబండి ప్రయాణం గురించి జార్జి.ఎన్.నెట్టో రాసిన మ్యూజింగ్స్ చదివాక నాకు మా గుర్రం బండి గుర్తొచ్చింది.మా సీతారమపురంలో హైస్కూల్ లేదు.ఐదు వరకే ఉంది.ఆరో క్లాసు చదవాలంటే నర్సాపురం(ఐదు కిలోమీటర్లు)వెళ్ళాలి. చదువు కోసం నేను మా ఇంట్లో నిత్య యుద్ధం చేసేదాన్ని.మా నాన్నకి నన్ను చదివించాలంటే ఇష్టమే కానీ ఉమ్మడి కుటుంబమవ్వడం వల్ల డబ్బులుండేవి కావు.ఏలాగోలా నేను నర్సాపురంలో ఓరియంటల్ స్కూల్లో చేరాను.ఆ స్కూల్లో ఫీజులుండేవి కావు.అద్దేపల్లి సర్వి శెట్టి అనే ఆయన ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా భర్తలు పోయిన వాళ్ళ కోసం ఓ సంస్థను స్థాపించి దానికి హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూలు అని పేరు పెట్టేరు.
విడోస్ కోసం అక్కడ ప్తిమెట్ర్క్,నేత.దాన్సు,సంగీతం లాంటివి నేర్పేవాళ్ళూ.ఆ సంస్థ కిందే మా ఓరియంటల్ స్కూల్ నడిచేది.ఫీజులు లేవు కబట్టి నా చదువు సధ్యమైంది.అయితే రోజూ స్కూల్కి వెళ్ళడం మాకు పెద్ద సంస్యగా ఉండేది.ఇంట్లో వాళ్ళు అసలు పట్టీంచుకునేవారు కాదు. కొన్ని సంవత్సరాలు నడిచే వెళ్ళేవళ్ళం. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెల్లేవాళ్ళం.నేను మెల్లగా సైకిల్ నేర్చుకున్నాను.మగవాళ్ళ సైకిల్ తొక్కేదాన్ని.లంగా,వోణీ వేసుకుని మగాళ్ళ సైకిల్ ఎక్కడం దిగడం చాలా కష్టంగా ఉండేది.మైలు రాళ్ళను చూసుకుని ఎక్కడం దిగడం చేసేదాన్ని.
అలా కష్టాలు పడుతుండగా మా ఉదురింటివాళ్ళ ఆడపిల్లలు నర్సాపురం హైస్కూల్లో చేరారు.వాళ్ళ కోసం వాళ్ళ నాన్న గుర్రం బండీ కొన్నాడు.ఆ బండి నడిపేటాయన పేరు మహెశ్వరం,మేము మామయ్య అని పిలిచేవాళ్ళం.ఆ బండిలో నన్ను మా చిన్నాన్న కూతురు భారతిని తేసుకెళ్ళేట్టుగా భారతి వాళ్ళ తాత ఏర్పాటు చేసాడు.

ఇంకా ఉంది.......

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...