Monday, August 5, 2013

ఈ ఆదివారం జ్యేష్టపౌర మితృలతో......

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే
నేను నా నేస్తాలెవ్వరినీ కలవలేదు
కానీ...నాకెంతో ఇష్టమైన జ్యేష్టపౌర మితృల్ని మాత్రం కలిసాను.
రోజంతా వాళ్ళతోనే గడిచింది.
సి ఆర్ ఫౌండేషన్ లో అబ్బూరి చాయాదేవిగారు,వారి మితృలతో ఉదయం గడిచింది.
మధ్యాహ్నం దాదాపు నాలుగు గంటలు కొడవటిగంటి కుటుంబరావు గారి సహచరి వరూధిని గారితోను,వారి కూతురు శాంత సుందరి గారితోను
గడిచింది.
వరూధిని గారు నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.కడుపుబ్బ నవ్వుకున్నాం.
ఆవిడ మాటలు చాలా పదునుగా ఉంటాయి.సూటిగా ఉంటాయ్.
వరూధిని గారు ఎలా ఉన్నారు అంటే మెగా సీరియల్ లాగా ఉన్నాను అన్నారు ఠక్కున.
అలాంటి చెణుకులు ఎన్నో ఉంటాయి వారి మాటల్లో.
తన వయస్సు 86. అయినా ఎంతో చురుకుగా,ఉత్సాహంగా ఉంటారు.
ఆవిడ మాట్లాడుతుంటే సర్వం మర్చిపోయి,చీకటి పడింది ఇంటికెళ్ళాలన్న ధ్యాస లేకుండా
ఆవిడ ఎదురుగా కూర్చుని మంత్రముగ్ధనై విన్నాను.
రోజంతా జ్యేష్టులతో గడవడం నాకో అద్బుతమైన అనుభవం.
 (11 photos)

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...