Wednesday, March 6, 2013

మితృలందరికీ ఒక విన్నపం

మితృలందరికీ ఒక విన్నపం

నేను చెస్తున్న ఈ విన్నపం ఒక అమ్మాయి గురించి.
ఆ అమ్మాయి ఫోటో ను ఇక్కడ పెట్టలేను.
****************
FRIDAY, JUNE 17, 2011

మనీషా ఆత్మ గౌరవం-చదువు కోసం ఆరాటం

ఓ నెల క్రితం ఆంధ్ర జ్యోతి నవ్య పేజీ లో మనీషా అనే అమ్మాయి గురించి భువనేశ్వరి అనే జర్నలిష్ట్ ఓ కధనం రాసింది.మనీషా గురించి చదివి నేను ఆ అమ్మాయిని కలిసాను.చూడ ముచ్చటగా ఉంది మనీషా. ఎంతో చురుకైంది.

భువనేశ్వరి ఏమి రాసిందంటే మనీషా వాళ్ళమ్మతో కలిసి చెప్పులు కుడుతుంది. వాళ్ళ నాన్న తాగుడు కోసం అప్పులు చేసి ఈ మధ్యనే చనిపోయాడు.చెప్పులు కుట్టడమే వాళ్ళ వృత్తి.అదే జీవనాధరం.చిన్న పిల్లవు కదా చదువుకోకుండా చెప్పులు కుడుతున్నావేంటి అని జర్నలిష్ట్ అడిగినపుడు నా స్కూల్ ఫీజు కోసమే చెప్పులు కుడుతున్నాను.నాకు పని ఇవ్వండి నా డబ్బు నేనే సంపాదించుకుంటాను.చదువుకుంటాను.అని చాలా ఆత్మ గౌరవంతో చెప్పింది.
ఆ మాటే నన్ను ఆ పిల్లని కలిసేలా చేసింది..

****************
MONDAY, JUNE 20, 2011

మనీషా మహానందంగా స్కూల్ కి
మనీషా ని ఈ రోజు 8200/-రూపాయలు ఫీజు కట్టి కీస్ హై స్కూల్ లో 7 వ క్లాస్ లో జాయిన్ చేసాను.
ఆ పిల్ల ముఖంలో కనబడిన సంతోషానికి ఖరీదు కట్టే శక్తి నాకు లేదు.
సంతోషం చిప్పిల్లే ఆ ముఖం లోని వెలుతురు నాకు ఎనలేని తృప్తినిచ్చింది.
నేను పిల్లల్ని కనలేదు.పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన అనుభవం లేదు.ఎంతో మందికి చదువు కోసం సహాయం చేసాను కానీ నేనే ఒక పిల్లని ఈ రోజు జాయిన్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపించింది.
నేను మనీషాని జాయిన్ చేసి బయట కొస్తుంటే ఎవరో ఆవిడ మా పాపకి కూడా ఫీజ్ కడతారా అని అడిగినపుడు నా నోట మాట రాలేదు.
ఎంత మంది పిల్లలు చదువుకు దూరమౌతున్నారో తలుచుకుంటే దుఖం వస్తుంది
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు వ్యక్తులుగా ఎంత మంది చెయ్యగలుగుతారు??

*********************
మనీషాని నేను చదివిస్తున్నాను.
తనని నేను ఎంతవరకైనా చదివించడానికి సిద్ధం గా ఉన్నాను.
తను స్కూల్ నుంచి వచ్చాకా చెప్పులు కుట్టి వాళ్ళమ్మకి సాయం చేస్తుంది.
అయితే వాళ్ళ నాన్న తాగుడి కోసం చేసిన అప్పులు,అతను చనిపోవడం తో ఆ అప్పుల్ని మనీషా వాళ్ళమ్మ కట్టాల్సి రావడం వాళ్ళ జీవనాధారం చాలా కష్టమైపోయింది.
నేను ఎస్ సి కార్పోరేషన్ నుంచి 20000 వేలు లోన్ ఇప్పించాను.
దాంతో ఒక బడ్డి కొనుక్కుని కొన్ని చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నారు.
అమ్మా! ఎక్కడైనా లక్ష రూపాయల లోన్ ఇప్పించు నెల నెలా కట్టుకుంటామంటోంది.
రోజూ ఫోన్ చేసి అడుగుతోంది.
ఈ విషయం మీ ముందు పెడితే వాళ్ళకి సాయం చెయ్యడానికి ఎవరైనా ముందుకు రావొచ్చు అనే ఆశతో రాస్తున్నాను.
నా వంతుగా వాళ్ళమ్మకి 10000 ఇద్దామనుకుంటున్నాను.
కానీ వాళ్ళకు కావలసింది లక్ష రూపాయలు.
మీలో ఎవరికైనా మనీషాని వ్యక్తిగతం గా కలవాలని ఉంటే అలాంటి వాళ్ళకు వివరలు ఇస్తాను.
స్పందించండి మితృలారా?


 తనకు అకౌంట్ లేదు.
నేను త్వరలో ఓపెన్ చేయిస్తాను.
ప్రస్తుతం నేను భూమిక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను.
దాన్లో డిపాసిట్ చెయ్యదలుచుకున్న వారు దయచేసి నాకు ముందు చెబితే బావుంటుంది.
మీరు భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేసి చెప్పినా సరే (1800 425 2908)
భూమిక అకౌంట్ నంబర్ :52196463457
ఎస్ బి హెచ్ బాగ్లింగంపల్లి శాఖ.

1 comment:

సామాన్య said...

మేమ్

మనీషా గురించి చదివాను . నేను ఈ నెల 28 న హైదరాబాద్ వస్తాను .వీలున్నంత వరకూ తనని కలవడానికి ప్రయత్నిస్తాను . లేదంటే నా వైపు నుండి కూడా పదివేలు ఆ రోజు ఇవ్వడమో ఎకౌంటు లో డ్రాప్ చేయడమో చేస్తాను . మీ దృష్టిలోకి వచ్చింది కనుక మనీష భవిష్యత్ గురించి మరేం బెంగ పడాల్సిన పని లేదని నా భావన .

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...