Thursday, February 18, 2010

మహిళలకు సహాయ కేంద్రం




మహిళలకు సహాయ కేంద్రం
మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిసిఎస్‌, హైదరాబాద్‌

   ఈ రోజు ఉదయం 11 గంటలకు  నగర పోలీస్ కమీషనర్ ఎ.కే ఖాన్ ప్రారంభించారు. మీటింగ్ ఉండడం వల్ల సబితా ఇంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేక పోయారు.
    మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవ హక్కులకు విఘాతంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా సహాయ కేంద్రాల్ని నెలకొల్పడమన్నది ఒకానొక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోలీసు విభాగంతో పాటు, ఆక్స్ ఫాం ఇండియా, స్వార్డ్ సంస్థల సమష్టి కృషి ఫలితంగా ఈ ప్రతిపాదన కార్యరూపాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2004లో ప్రారంభమైన ఈ మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు నేడు పౌరసమాజమూ, ప్రభుత్వాల మధ్య అద్భుత సమన్వయ సహకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోత్సాహకర అనుభవం ఆధారంగా సహాయ కేంద్రాల ఏర్పాటు డిఎఫ్యైడి సహకారంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు (వరంగల్, కరీంనగర్, అనంతపురం) విస్తరించింది. శ్రీ ఎ.కె.ఖాన్‌ అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్)గా పనిచేస్తున్న కాలంలో దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో పదిచోట్ల సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ దిశగా సంయుక్త కార్యాచరణకు సంబంధించిన ఒక ఒడంబడికని డిజిపి కార్యాలయం ఆమోదించాల్సి
 ఉంది.
    ఐదు లక్షల రూపాయల వ్యయంతో సహాయ కేంద్ర నమూనా నిర్మితమైంది. ఇటువంటి కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో నిధుల్ని అందించడమన్నది  ఆక్స్ ఫాం ఇండియా చరిత్రలో ఇదే మొదటిసారి. వైవాహిక, గృహ హింసలనెదుర్కుంటున్న మహిళల సమస్యల్ని పరిష్కరించాలంటే అందుకు సానుకూల వాతావరణంతోపాటు, గోప్యమైన విచారణ కూడా అవసరం. ప్రధానంగా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే సహాయ కేంద్ర రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో పాటు వచ్చే వృద్ధులు, పిల్లలు రోజల్లా స్టేషన్‌ వెలుపలే వేచి ఉండాల్సిన అగత్యముండేది. ఈ అసౌకర్యాన్ని కూడా గుర్తించే కేంద్ర రూపకల్పనలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేగాక కేంద్రనిర్వహణలో కొందరు మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తలు వంటి నిపుణుల సహకారం అవసరమవుతుంది కనుక, వారిక్కూడా కొంత చోటును కేటాయించాల్సి వచ్చింది. 
   హింసలకి గురైన బాధితులు, ఫిర్యాదుదారులపై ప్రతిదాడులు జరగకుండా నిరోధించేందుకు అన్ని కోణాల్లోనూ సహకరించడంతో పాటు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా యువతని, కుటుంబాల్ని, అన్ని సామాజిక వర్గాల్ని చైతన్యపరచడం ప్రధాన బాధ్యతగా సహాయ కేంద్రాలు పనిచేస్తాయి. ఇలాంటి వ్యవస్థ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఒరిస్సా, రాజస్థాన్‌లలో ఇదివరకే అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ˜, గుజరాత్
లలో సహాయ కేంద్రాల ఏర్పాటు ఇంకా ప్రారంభదశలో ఉంది.
    పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోనే వ్యూహాత్మకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు సంబంధించి న్యాయవ్యవస్థ పరిధిలోనే బాధిత మహిళలకు మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన రక్షణతోపాటు చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పించినట్టవుతుంది. సహాయ కేంద్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్లయిన (సామాజిక సేవ, సామాజిక శాస్త్రాలు) ఇద్దరు సామాజిక కార్యకర్తలు హింసకు గురైన మహిళలకు, పిల్లలకు చట్టపరమైన సలహాలతో పాటు, అన్ని విధాలైన సహాయ సహకారాల్ని అందిస్తారు. 
మహిళలు, పిల్లలకు సహాయాన్నందించడంలో కేంద్రం పాత్ర, విధివిధానాలు
    - బాధిత మహిళలకు మానసిక స్థయిర్యాన్ని కలిగించడంతో పాటు, వారికి భావోద్వేగ పరమైన సహాయాన్ని అందించడం
    - హింసను విడనాడే విధంగా హింసకు పాల్పడిన, అందుకు సహకరించిన వ్యక్తులతో అవసరమైన చర్చలు జరపడం
    - మహిళలకు అవసరమైన అన్ని సహాయ వ్యవస్థల్ని పెంపొందించే విధంగా కృషి చేయడం
    - మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా పోలీసు సహకారం కోసం ప్రయత్నించడం
    - చట్టపరమైన సహాయాన్నందించడం
    - తాత్కాలికంగానైనా హోమ్స్, ఇనిస్టిట్యూషన్స్, హాస్టళ్ళు,తదితర మార్గాల ద్వారా బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడం
    - బాధిత మహిళలకు అండగా నిలిచే పురుషులతో కలిసి పనిచేయడం,
    - స్త్రీధనం వంటి ఆస్తుల పునర్నిర్మాణం, పరిరక్షణ దిశగా బాధిత మహిళలకు సహాయమందించడం
    - యువతరం, విద్యా సంస్థలు, సామాజిక వర్గాల్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెరిగేలా వారితో కలిసి పనిచేయడం
    - నేరం జరిగిన తరువాత, సంక్షోభానంతర కాలంలో బాధిత మహిళలకు మరింత మానసిక స్థయిర్యాన్ని కల్పించేలా కవ్న్సెలింగ్ నిర్వహించడం

3 comments:

శ్రీలలిత said...

Really great...
Congratulations
మీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్లు..

Nrahamthulla said...

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చమెత్తుకునే పిల్లలకు చదువు వసతి కల్పించాలని మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించారు.http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=309493&Categoryid=1&subcatid=33

పసికందులతో భిక్షాటన
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌)కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.

Nrahamthulla said...

పిల్లలు,గృహహింస వద్దనుకునే మహిళలు, అవివాహితలుగా ఉండాలనుకునే స్త్రీలు రానురాను పెరుగుతున్నారు.మహిళాబిల్లు పాసై స్త్రీలు పురోగతి సాధించేకొద్దీ మహిళల్లో బ్రహ్మచారిణులు ఇంకా పెరగొచ్చు.పురుషునిలాగానే స్త్రీ కూడా ఒంటరిగా బ్రహ్మచారిణిగా ఈ సమాజంలో మనమధ్యే ఉండకూడదనే చట్టాలు ఏమీలేవు.పెళ్ళికిముందే శృంగారం,సహజీవనం నేరం కానప్పుడు స్త్రీ ఒంటరిగా బ్రతకాలనుకోవటం నేరమా?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...