Saturday, November 17, 2007

విజ్ఞప్తి

పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

వెబ్‌సైట్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక.

ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి మేము రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టాము.

1. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఫోన్‌ నెంబర్లు, హెల్ప్‌లైనులు, న్యాయవాదులు, మానసిక సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి- అలాగే పిల్లలకి సంబంధించిన చట్టాలు సహాయలు, సంస్థలు, హెల్ప్‌లైనులు లాంటి వివరాలతో సమగ్రంగా రూపొందుతున్న డైరీ - 2008. దీని వెల రూ. 120/-

2. భూమిక హెర్బల్‌ హేండీ డైరీ - మేము 1998లో భూమిక నిధుల సేకరణ కోసం ప్రచురించిన హెర్బల్‌ డైరీని మరింత సమగ్రంగా, నూతన సమాచారంతో పునర్ముద్రించదలిచాము. అప్పట్లో ఈ డైరీ ఎంతో ఆదరణ పొందింది. మన చుట్ట వుండే, మన ఇంట్లో వుండే ఎన్నో వస్తువులతో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉపశమనాలు పొందొచ్చు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి వద్ద వుండతగింది. దీని వెల. రూ. 35/-

మేము ఈ రెండు డైరీల ప్రచురణ భూమికకు నిధులను సేకరించడం కోసమే చేపట్టాం. వీటి అమ్మకాల ద్వారా కొంత మూలనిధిని సేకరించాలనేది ముఖ్య ఉద్ధేశ్యం. భూమిక పట్ల మీ ప్రేమని, నిబద్ధతని ప్రకటించుకోవడానికి చక్కటి అవకాశం. హెర్బల్‌ డైరీని ఎక్కువ సంఖ్యలో కొని మీ బంధు, మిత్రులకు నూతన సంవత్సర కానుకగా బహూకరించండి. గ్రీటింగు కార్టులకు వందలకు వందలు ఖర్చు పెట్టే బదులు హెర్బల్‌ డైరీని కొంటే భూమికకు ఆర్ధిక లాభం -బహుమతి పొందినవారికి ఆరోగ్యలాభం. మిత్రులంతా ఒక్కొక్కరు పదికి మించకుండా ఆర్డర్‌ చేస్తే భూమిక పదికాలాల పాటు ఆర్ధికంగా నిలదొక్కుకుంటుంది.
భూమికను నిలబెట్టుకోవాలనే మా ఆవేదన అర్ధం చేసుకుంటారని. మేము ప్రచురిస్తున్న రెండు డైరీలను ఆదరిస్తారని ఆశిస్తూ…

Tuesday, October 23, 2007





లుంబినిలో ఆకాశ మల్లెల వనం

లుంబిని పక్కనున్న పార్కింగ్ లో ఆకాశమల్లెల వనంలో
కాసేపు విహరించండి.
బాసింపట్టు వేసుకుకుని ఏ ఆకాశమల్లె చెట్టుకిందైనా
కళ్ళుమూసుకుని కూర్చోండి
మనమీద పరిమళాలు వెదజల్లుతూ
జలజలా రాలే ఆకాశమల్లెల్ని అనుభూతించండి.

Thursday, October 18, 2007

ఆకాశమల్లెల జడివాన





అనుకోకుండా ఇంటికొచ్చిన పిల్ల సిసింద్రీలను
వెంటేసుకుని ఈట్ స్ట్రీట్ కి వెళ్ళానా
ఎదురుగా ఉన్న పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంటే
ఆకాశమల్లెల పరిమళం హటాత్తుగా చుట్టుముట్టింది
తలెత్తి చూద్దును కదా
గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఆకాశమల్లెలు
పచ్చటి కారప్పూల చెట్లకి
ధవళ వర్ణం లో కుప్పలు తెప్పలుగా
విరగబూసిన ఆకాశ మల్లెలు
చిన్నప్పుడు కారప్పూలని పిలుచుకుంటే
భాగ్యనగరంలో అవే ఆకాశమల్లెలయ్యాయి
అందంగా పొందిగ్గా బారులు తీరి నిలబడ్డ
ఆకాశమల్లె చెట్ల కింద
ఆదమరిచి నిలబడ్డానా
జలజలా నా తలమీద
కాదు కాదు నా తనువంతా
తడిపేసిన ఆకాశమల్లెల జడివాన

ఈట్ స్త్రీట్ వెర్రి హోరుకి
పార్కింగ్ లోని ఈ పారవశ్యానికి
పొంతన ఎలా కుదర్చడం ?
ఒక్కొక్క పువ్వూ ఒయ్యారాలుపోతూ
పరిమళాలు వెదజల్లుతూ
నా మీద వాలుతుంటే
అబ్బో! ఆ అనుభవాన్ని అక్షరీకరించడం
ఇలా మీతో పంచుకోవడం
మహదానందంగా ఉంది.

Tuesday, October 9, 2007

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్?

2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం సాగిస్తున్నాడు. పూజ తన భర్త, అత్తతో కలిసి బతుకుతోంది. పూజ ఎక్కువగా చదువుకోలేదు. పెళ్ళయిన ఆరేడు నెలలకే ఆమెకు భర్తనుంచి కట్నం వేధింపులు మొదలయ్యయి. అదనపు కట్నం తెమ్మని భర్త, అత్త కలిసి తిట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఆడపిల్లను కన్నందుకు కూడా హింసను చవిచడాల్సి వచ్చింది. ఒక రోజు ఆమెను బాగా కొట్టి, బిడ్డతో సహా ఇంట్లోంచి గెంటేయడం జరిగింది. తల్లిదండ్రులిచ్చిన కొద్దిపాటు సొమ్ముతో ఆమె అద్దె ఇంట్లో బతకడం మొదలుపెట్టింది. సరైన తిండి లేక, పోషకాహార లోపంతో తల్లీ బిడ్డలు చిక్కిశల్యాలయ్యారు. భర్త ఆమె అద్దెకుంటున్న ఇంటికి కూడా వచ్చి కట్నం తెమ్మని హింసించేవాడు.

ఈ దశలో పూజ మనోవర్తి కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 కింద కేసు వేసింది. సంవత్సరం గడిచిపోయినా ఆమెకు కనీసం తాత్కాలిక భృతి కూడా మంజూరు కాలేదు. కేసు కోర్టులో మూలుగుతోంది. అంతకు ముందు పూజ తన మీద హింస జరిగినపుడల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కుటుంబ తగాదా పేరు మీద పోలీసులు కేసును రిజిష్టర్ చెయ్యడంగాని, ఆమె మీద హింసను తగ్గించడానికి చర్యలుగానీ ఏమీ తీసుకోలేదు. పది పదిహేను సార్లు ఇలా జరిగింది. పోలీసులు అన్ని సార్లు కూడా ఎలాంటి చర్యల తీసుకోలేదు.

జూన్ 29న ఆమె మీద ఆమె భర్త దారుణ హింసని ప్రయెగించినపుడు ఆమె పోలీస్ కమీషనర్ కార్యాలయనికి వెళ్ళి, తన ఫిర్యాదును రిజిస్టర్ చేసుకుని, తనకు న్యాయం చేయకపోతే తనను తాను నిప్పటించు కుంటానని హెచ్చరించింది. ఆ రోజు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో లేకపోవడంతో తన సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కూడా తనని తాను కాల్చుకుంటానని బెదిరించినపుడు వత్రమే ఆమె కేసును రిజిష్టర్ చేసారు. ఆ తర్వాత ప్రతాప్ ఆమె ఇంటికెళ్ళి పోలీసులు తననేమీ చేయలేరని, ఒక్క రోజులో బెయిల్ మీద బయటకొస్తానని, నీ అంతు చస్తానని బెదిరించాడు. అతను బెదిరించినట్టుగానే అరెస్టయి, వెంటనే బెయిల్ మీద బయటకొచ్చేసాడు. ఇక ప్రతాప్ తనని బతకనివ్వడని పోలీసులు తనను రక్షించరని నిర్ణయించుకున్న తర్వాతే పోలీసులు, న్యాయవ్యవస్థ నిర్లక్ష్య వైఖరులను ఎండగట్టటానికి, దేశం మొత్తం తెలపడానికి లోదుస్తులు వత్రమే ధరించి రాజ్కోట్ రింగు రోడ్డు మీద నడిచి తన తీవ్ర నిరశన తెలిపింది. దినపత్రికలు, టి.వీ ఛానళ్ళు ఆమె ఫోటోను ప్రచురించాయి. ఆమె నిరశనకి ఎక్కువ ప్రాధాన్యమీయకుండా, ఆమెకు న్యాయం జరిగేలా ప్రయత్నించకుండా, పూజ వనసిక స్థితి మీద అనువనాలు కలిగేలా వార్తా కథనాలు, ఇంటర్వ్యలు ప్రసారం చేసాయి. అంటే మీడియ కూడా ఆమె పట్ల అవనుషంగా ప్రవర్తించింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు ప్రవేశించి ఆమె కేసును ఎంత నీరు గార్చాలో అంతా చేస్తున్నారు. పూజ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ర.800 మనోవర్తి వత్రంమంజూరైంది.

పూజా చౌహాన్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశ్లేషిస్తే ఈ దేశంలో స్త్రీల పట్ల పోలీసులు, న్యాయం, మీడియ, రాజకీయ నాయకులు ఎంత బండతనంతో, ఎంత ఇన్సెన్సిటివ్గా ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంత తీవ్రమైన గృహహింస కేసులో (గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా) పోలీసులు పూజను రక్షణాధికారిని కలవమని కనీసం చెప్పలేకపోవడం, ఆమెకు సరైన రక్షణ కల్పించకపోవడం, మనోవర్తి కేసుల్ని కూడా వమూలు కేసుల్లా మూలన పడేయడం చస్తే స్త్రీలకు న్యాయం ఎంత అందని పండో అర్ధమవుతుంది. అత్యుత్సాహంతో ప్రతీదాన్ని సెన్సేషన్ కళ్ళద్దాల్లోంచి మాత్రమే చేసే మీడియ కూడ ఆమెకి న్యాయం అందించలేకపోయింది. రాజకీయ నాయకులు ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయలబ్ది పొందాలనే చేసారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలోంచి పూజాచౌహాన్ చేస్తున్న పోరాటం, ఆమె తన నిరశసనను తెలియచేయడానికి ఎంచుకున్న పద్ధతిని అర్థం చేసుకోవడం, ఆమెలాంటి స్త్రీల ఒంటరి పోరాటాలకు అండగా వుండడం అత్యవసరం. ఆమె పూజ కావచ్చు లేదా మరో రోజా కూడా కావచ్చు.

Tuesday, September 25, 2007

ఆరు బ్రహ్మ కమలాలతో నేను


ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

Monday, September 24, 2007

పత్తి మందారం








పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

Saturday, September 15, 2007

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండి ఆమె నిర్బంధంలోనే వుంది. బలవంతంగా ముక్కుకు గొట్టాలు అమర్చి ఆహారం పంపిస్తున్నారు. ఆమెకు కొన్నిసార్లు బెయిల్ దొరికినా, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడంతో మళ్ళీ మళ్ళీ అరెస్టు చేయడం జైలుకి పంపడంజరుగుతూ వచ్చింది.

ఈ ఏడేళ్ళ కాలంలో షర్మిల వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నిరక్షరాస్యురాలైన , గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. “మీరు ఎందుకు మీ బిడ్డను చూడడానికి వెళ్ళలేదు” అని అడిగిన ఒక విలేఖరికి ఆమె తల్లి ఇరామ్ సఖీదేవి ఇచ్చిన సమాధానం “నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన ధృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలుచుకోలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు ఆమెను చూడదలుచుకోలేదు.”

షర్మిల నిరాహారదీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004 లో మణిపూర్ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమ అనే మహిళ అత్యాచారానికి, హత్యకి బలైనపుడు మణిపూర్ స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకి వారిని ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ ముందు మణిపురి తల్లుల నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేసిందీ నగ్న ప్రదర్శన.

ఇంఫాల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని జుడీషియల్ కస్టడీ నుంచి బెయిల్ దొరికిన వెంటనే ఆమె మిత్రులు షర్మిలాను ఢిల్లీకి తరలించారు. చాలా నాటకీయ పరిస్థితుల్లో ఆమె హఠాత్తుగా అక్టోబరు 2 న ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ముందు ప్రత్యక్షమై మహాత్మాగాంధి సమాధి మీద పుష్పగుచ్ఛం వుంచుతూ “మహాత్మా గాంధీ కనుక ఈరోజు బతికి వుండి వుంటే, ఆయన తప్పకుండా సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి వుండేవాడని నేను యావత్ భారత ప్రజలకు చెప్పదలిచాను. భారతీయులందరికీ నా విన్నపం ఒక్కటే. సాయుధ దళాల చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పండి. మా ప్రచారంలో భాగం పంచుకోండి” (టెలిగ్రాఫ్ అక్టోబరు 5, 2006)

ప్రస్తుతం షర్మిలను అరెస్టు చేసి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వుంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఇంఫాల్ హాస్పిటల్ ఇరుకు గదిలోంచి, ఎయిమ్స్‌లోని స్పెషల్ వార్డులో వుంటూ షర్మిల తన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే వుంది. అయితే ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ముక్కుకి బలవంతంగా అమర్చిన గొట్టం వల్ల షర్మిల తీవ్రమైన బాధని భరిస్తోంది.. ఇటీవలే ఆమె బి.బి.సిలో మాట్లాడుతూ “మణిపూర్ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతికోసం” అంటూ ప్రకటించింది.

ముప్పై ఐదేళ్ళ బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత పద్ధతిలో, మడమతిప్పనిపోరు సల్పుతోంది. తన ప్రాణాలను తన ప్రజలకోసం తృణ ప్రాయంగా ఫణంగా పెట్టి పోరాడుతున్న షర్మిలా ఇరామ్‌తో గొంతు కలపడం అభ్యుదయాన్ని కాంక్షించే వారందరి కర్తవ్యం.

Friday, September 14, 2007

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
‘’నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…'’

ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.

విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.

తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు - మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.

ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Sunday, August 26, 2007

గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?


మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!


నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?

Friday, August 17, 2007







ఒక్కటి కాదు రెండు కాదు
ఐదు బ్రహ్మ కమలాలు


నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ
కమలాలు/వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ
ఒకేసారి పూసాయి.అబ్బ! అంత ఘాటైన పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు.మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను.

Wednesday, August 15, 2007




ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

Monday, July 23, 2007



నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

కొండవీటి సత్యవతి

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా మని కూడా చెప్పింది. ఆ క్యాంప్‌ చూడడానికి వెళ్ళాను నేను. మూసాపేటలో ఓ మారు మూల ఉన్న చిన్న పాఠశాల. అందులో చదివేది అందరూ ముస్లిమ్‌ పిల్లలే. అక్కడ సులోచనా రాణి, డా|| సునంద, సి. సుజాత ఇంకా కొంత మంది మిత్రులు కలిసారు. మాటల సందర్భంలో తను ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యా నని, ఎవరైనా పిల్లలు వుంటే వాళ్ళకు ఆంగ్లం నేర్పాలని ఉందని సునంద అన్నారు. కుందన్‌బాగులో ప్రయత్నం చేద్దాము లెండి అన్నాన్నేను.

అలా ఒక చిన్న ప్రయత్నానికి బీజం పడిందక్కడ. ఆ బీజం మొలకౌవుతుందని, చిగురుల్లాంటి పిల్లలలో నేను వేసవి శెలవుల్ని గడుపుతానని అస్సలు అనుకోలేదు. అంతవరకు నాకు అలాంటి ఆలోచనే లేదు. సరే. ఆలోచనను ఆచరణ లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. మా ఇంటి ఆవరణలోనే వుండే షమీమ్‌, ఆయేషాలని పిలిచి నా ఆలోచన గురించి చెప్పాను. కుందన్‌బాగులో ఎక్కడైనా చిన్న స్థలం దొరికితే మనం సమ్మర్‌ క్యాంపు పెట్టుకుందామన్నపుడు మా స్కూల్‌లోనే పెడదామన్నారు వాళ్ళు. వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళ స్కూల్‌ వివేకానంద విద్యాలయ చూసొ చ్చాను. బావుంది. ఆ స్కూల్‌ యజమాని కేంప్‌ నడుపుకోడానికి ఒప్పుకున్నాడు.

ఈ ప్రాంతాన్ని మక్తా అంటారు. మురికివాడ లక్షణాలు పూర్తిగా లేకున్నా మురికివాడ కిందకే వస్తుంది. ఊళ్ళలో పనులులేక, ఉపాధి అవకాశాలు లేక హైదరాబాదుకు వలస వచ్చినవారు ఎక్కువగా వుంటారిక్కడ. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి దూరప్రాంతాలనించి వచ్చినవారు చాలామందే వున్నారు. మామూలుగా వేసవిలో నడిచే ఖరీదైన క్యాంపులకు వెళ్ళగలిగే ఆర్థికస్తోమతలేని పిల్లలు ఇక్కడ చాలామంది వున్నారు.

షమీమ్‌, ఆయేషాలు సైకిల్‌ మీద ఆ ప్రాంతమంతా తిరిగి సమ్మర్‌ క్యాంపు గురించి ప్రచారం చేసారు. కుందన్‌బాగు బంగ్లాలలో పనిచేసే అటెండర్ల పిల్లలకు కూడా కబురు అందించాం. షమీమ్‌ వాళ్ళు రెండు రోజులు తిరిగి ముప్ఫైమంది పిల్లల్ని పోగేసారు. ఇంకేం స్థలం దొరికింది. పిల్లల్ని కూడేసాం. మే 10న క్యాంప్‌ ప్రారంభించాలనుకున్నాం.

మే పదిన సులోచనారాణి, డా|| సునంద, డా|| వహీదా, సుజాత గార్లు వచ్చారు. ముప్ఫైమంది పిల్లలు వచ్చారు. రకరకాల వయస్సులవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. అలా మా క్యాంప్‌ మొదలైంది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా వుండేవారు. ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి పదకొండు, పదకొండున్నర మధ్య ముగించేవాళ్ళం. ఆటలు, పాటలు, డాన్సులు, డ్రాయింగులు నేర్పేవాళ్ళం. సునందగారికి పిల్లలకి ఇంగ్లీషు నేర్పాలని ఉండేది. అయితే పిల్లలు ఎక్కువమంది చిన్నవాళ్ళు అవడంవల్ల కొంచం కష్టంగా వుండేది. పదిరోజుల తర్వాత తనకు వ్యక్తిగత పనులు వున్నాయని ఇక రాలేనని సునందగారు చెప్పి వెళ్ళిపోయారు.

ఈ క్యాంప్‌ని ఇరవై నాలుగు రోజులు నడిపాం. పిల్లలకి పాటుల నేర్పడం కోసం నేను పాటలు నేర్చుకున్నాను. భూపాల్‌ రాసిన పిల్లల పాటల్ని వాళ్ళకి నేర్పాను. ఒక్కసారి చెప్పగానే చకాచకా నేర్చేసుకునేవాళ్ళు. ఇరవైకన్నా ఎక్కువ పాటలు నేర్పాను. వాళ్ళు కాంప్‌కి రాగానే వందేమాతరం, మా తెలుగు తల్లికి పాటలతో మొదలుపెట్టి జణగణమనతో ముగించేవాళ్ళు. ఆరోగ్యంగా వుండడం గురించి, పళ్ళు శుభ్రంగా తోముకోవడం గురించి, అమ్మా నాన్నల్ని, చదువుచెప్పే గురువుల్ని ఎలా గౌరవించాలి, కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా వుండాలో అన్నీ పాటలద్వారా చెప్పేదాన్ని. వాళ్ళు చక్కటి అభినయంతో పాడేవాళ్ళు.

మధ్యలో డా|| విష్ణుప్రియ నాతో చేరారు. ఆవిడ, నేనూ కలిసి చివరిదాకా క్యాంప్‌ నిర్వహించాం. పిల్లలతో ఉత్తరాలు రాయించడం, కథలు చెప్పించడం, బొమ్మలు వేయించడం లాంటివి చేయించాం. బుల్లి కొబ్బరిపిందెలతో, ఆలుముక్కలతో, దొండకాయ ముక్కలతో చక్కగా రథాలు చేసి ఆకులతో పూలతో అలంకరించారు. నా ఫ్రెండ్‌ భార్గవి ఒక రోజు కేంప్‌కి వచ్చి రంగురంగుల కొవ్వొత్తులు ఎలా తయారు చేస్తారో చూపించి పిల్లల్ని సంభ్రమంలో ముంచెత్తింది. అంతేకాదు తాను తెచ్చిన ప్రమిదల్లో రంగురంగుల వేక్స్‌పోసి, వొత్తిపెట్టి అవి పిల్లలకే ప్రజంట్‌ చేసినపుడు ఆ పసిముఖాల్లోని ఆనందాన్ని చూసి తీరాల్సిందే! ఎన్ని రాశుల డబ్బులు పోసినా ఆ ఆనందాన్ని కొనలేం. అనుభవించా ల్సిందే.

పిల్లల చేత ఆడించి, పాడించి, బొమ్మ లేయించిన తర్వాత వాళ్ళకి పండ్లు, స్వీట్లు, బిస్కట్‌లు, చాక్‌లెట్‌ లాంటివి పంచే వాళ్ళం. వాటిని ఆరగించి, సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ... అన్నట్లు ఈ కేంప్‌లో మేము ముగ్గురి పుట్టిన రోజులు కూడా జరిపాం. ఒకరు రిథమ. రెండు రాణి. మూడు శివ. కేకులు కట్‌ చేసి, ఐస ్‌క్రీమ్‌లు పంచాం. ఇక్కడ శివ గురించి కొంచం చెప్పాలి. ఈ కుర్రాడు సెవెంత్‌ చదువు తున్నాడు. చాలా తెలివైన, ప్రతిభావంతుడైన కుర్రాడు. నేను నా మిడిమిడి జ్ఞానంతో ఒక గిరిజన నృత్యాన్ని నాలుగు స్టెప్పు లు నేర్పిస్తే వాడు దానిని పద మూడు స్టెప్పు లుగా విస్తరించి, అందరికీ చక్కగా నేర్పాడు. మూడు నాట కాలను వాడే రూపొందించి నటింపచేసాడు. అమ్మాపులి, చెట్టు సాక్ష్యం, అపాయంలో ఉపాయం నాటకాల్లో శివ హీరో. మూడు నాటికలను పిల్లలు చక్కగా ప్రదర్శించారు.

కొంతమంది పిల్లలకి జూన్‌ మొదట వారంలోనే స్కూల్స్‌ తెరుస్తుండటంతో జూన్‌ 2న మా క్యాంప్‌ ముగిద్దామ నుకున్నాం. ముగింపు కార్య క్రమానికి యద్దన పూడి, సునంద, వహీదా, విష్ణు ప్రియ, గీత హాజరయ్యారు. పిల్లలు రంగురంగుల పువ్వుల్లా ముస్తాబై వచ్చారు. రెండు న్నర గంటల పాటు వాళ్ళు నేర్చుకున్న వన్నీ ప్రదర్శించారు. దాదాపు ఇరవై పాటల్ని అభినయం తో పాడి విన్పించారు. హైలెస్సా డాన్సు చేసారు. మూడు నాటికలు ప్రదర్శించారు. వాళ్ళు వేసిన బొమ్మల్ని ఎగ్జిబిషన్‌లాగా పెట్టాము. చివర్లో వాళ్ళ కోసం కొన్న బహుమతుల్ని పంచిపెట్టాము. ఒక టిఫిన్‌ బాక్సు, వాటర్‌బాటిల్‌, కలర్‌ పెన్సిల్స్‌, పెన్సిల్‌ బాక్సులు పంచాం. అన్నింటిలోను ప్రతిభ కన్పరిచిన శివకుమార్‌కి, రెగ్యులర్‌గా క్యాంపుకి వచ్చిన గిరీష్‌కి మొమెంటోలిచ్చాం. వివిధ పోటీల్లో నెగ్గినవారికి చెస్‌, టిన్నికాయిట్‌, క్రికెట్‌బాల్‌ లాంటివి ఇచ్చాం. అగ్గిపెట్టెలో వస్తువులు పెట్టుకురమ్మని చెప్తే ఒక్కొక్కళ్ళు 160, 150, 140 బుల్లిబుల్లి వస్తువుల్ని సేకరించిపెట్టారు. అలా ఆటల్తో, పాటల్తో సమ్మర్‌కాంప్‌ ముగిసింది.

ఈ కేంప్‌ని ఆర్గనైజ్‌ చేసిన సందర్భంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మనం దేన్నైనా మనస్ఫూర్తిగా మొదలుపెడితే ఏదీ దానిని ఆపలేదు. అలాగే ఏదైనా చెయ్యడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. ఇలాంటి క్యాంపులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు పెట్టగలిగితే, ఏ సౌకర్యమూ లేని మురికివాడల పిల్లలు కూడా వేసవిశిబిరాల సంతోషాన్ని పొందుతారు. నేను ఈ క్యాంప్‌ మొదలు పెట్టినపుడు డబ్బు గురించి ఆలోచించలేదు. యద్దనపూడి గారు ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ బానర్‌నే పెట్టాము. దీనిద్వారా భూమిక హెల్ప్‌లైన్‌ నంబరును ఆ ప్రాంతంలో ప్రాచుర్యానికి తేగలిగాను. క్యాంపు చూడడానికి వచ్చిన కె.బి. లక్ష్మి రూ.500/- విరాళం ఇచ్చింది. సునంద కూడా రూ.500/- ఇచ్చారు. ఇక శాంతసుందరి గారయితే వెయ్యి రూపాయలిచ్చారు. వహీదా మొదటిరోజునే పిల్లలందరికి పెన్సిల్‌బాక్సులిచ్చింది. విష్ణుప్రియ కలర్‌ పెన్సిల్స్‌, తినుభండారాలు తెచ్చారు. భార్గవి తానే అన్నీ కొనుక్కుని వచ్చి కొవ్వొత్తుల తయారీ చూపించింది. అక్కడికొచ్చిన స్త్రీల కోసం ఫినాయల్‌, సబీనా పౌడర్‌ తయారీలను కూడా చూపించింది. సులోచనారాణి గారు వచ్చినపుడల్లా పండ్లు తెచ్చి పంచేవారు. ముగింపు రోజున పిల్లలకి స్వీట్లు పంచారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఓ చెయ్యి వేస్తే పదిచేతులు సహాయంగా వస్తాయని చెప్పడం కోసమే. మనం ఓ అడుగేస్తే, పది అడుగులు మనని అనుసరిస్తాయని నిరూపించడం కోసమే.

నేను సాధార ణంగా వేసవిలో ఎటైనా దూర ప్రాంతాలకెళ్ళి గడుపుతుంటాను. అది నాకు చాలా ఇష్టం. అయితే ఈ వేసవిలో నేను ఒక్క రోజు కోసం కూడా హైదరాబాదు దాటి వెళ్ళలేదు. అయితే విహార యాత్రకి వెళ్ళినప్పటికంటే ఎక్కువ సంతోషాన్నే నేను పొందాను. పిల్ల లతో కలిసి ఆడాను, పాడాను, నృత్యాలు చేసాను. ఈ పిల్లలంతా మే పదికి ముందు నాకు అపరి చితులు. కానీ జూన్‌ 2 నాటికి నాకు చాలా ఆత్మీయులైనారు. ముగింపు రోజున నాకు చాలా దుఃఖ మన్పించింది. పిల్లల్ని వదిలిరావడం కష్టమైంది.

మొత్తానికి అనుకోకుండా, ఎలాంటి ప్లానింగు లేకుండా మొదలైన చిన్న ప్రయత్నం విజయవంతంగా ముగిసింది. ఆ పిల్లల ముఖాల్లో నవ్వుల్ని పూయించడమే ఈ క్యాంప్‌ ముఖ్య ఉద్దేశ్యంగా మొదలై, వాళ్ళ నవ్వుల మధ్యే ముగిసింది. పిల్లల చల్లటి చిరునవ్వులు, వేసవికాలపు సాయంత్రాలు హఠాత్తుగా కురిసే చిరుజల్లుల్లా నన్ను అలరంచి సేదతీర్చాయని గర్వంగా, సంతోషంగా చెప్పగలను.

Monday, July 16, 2007

మిగిలిన భాగం

అలా మేము గుర్రం బండీ మీద కొంత కాలం స్కూలుకి వెళ్ళేం.మహేశ్వరం మావయ్య పూలరంగడిలా సెంట్లు పూసుకుని హుషారుగా ఉండేవాడు.అతను తన భార్యతో కాక కాలవ గట్టు మీద వేరే ఇంట్లో ఉండేవాడు.ఆ వేరే ఆమెని బీబమ్మ అనేవాళ్ళు. ముస్లిం స్త్రీ అన్నమాట.మహేశ్వరం మావయ్య తన ఇంట్లో తన భార్యతో కాక బీబమ్మతో ఎందుకుండేవాడో అర్ధమయ్యే వయసు కాదు. కానీ హుషారుగ బండి నడపడం,మమ్మల్ని బండి లో ఎక్కించుకోవడం,మళ్ళి జాగ్రత్తగా తీసుకురావడంతో అతనంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది.అతను తన భార్యను పట్టించుకోకపోవడమే కాక బాగా కొట్టేవాడని చెప్పుకునేవారు.ఇప్పుడు తలచుకుంటే అతనంటే అసహ్యంగా అనిపిస్తుంది కానినా చదువు కొనసాగడంలో,చదువు నా జీవితంలో తెచ్చిన మార్పులో అతని పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా ఒప్పుకుంటాను.ఆ గుర్రం బండి, మహేశ్వరం మవయ్య అంటే అందుకే ఒకలాంటి అభిమానం.ఆడవాళ్ళ పట్ల జరిగే అమానుషాలు,దుర్మార్గాలూఎలా ఉంటాయో వాటి స్వరూపం ఆ రోజుల్లో అర్ధమై ఉంటే నేనతని బండి ఎక్కేదాన్ని కాదు.
ఓ సారి మా బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది.నాకేమీ దెబ్బలు తగల్లేదు కానీ భారతి స్ప్రుహ తప్పి పడిపోయింది.మా పుస్తకాలన్నీ నీళ్ళల్లో పడిపోయాయి.
చాలా రోజులవరకు మాకు పుస్తకాలు దొరకలేదు. "హిందు" లో మ్యూజింగ్స్ చదవగానే నాకిదంతా గుర్తుకొచ్చింది.దాదాపు నలభై ఏళ్ళనాటి మాట.

Sunday, July 15, 2007



మా గుర్రం బండీ-మహేశ్వరం మామయ్య

ఈరోజు హిందూ పేపర్లో ఎద్దుబండి ప్రయాణం గురించి జార్జి.ఎన్.నెట్టో రాసిన మ్యూజింగ్స్ చదివాక నాకు మా గుర్రం బండి గుర్తొచ్చింది.మా సీతారమపురంలో హైస్కూల్ లేదు.ఐదు వరకే ఉంది.ఆరో క్లాసు చదవాలంటే నర్సాపురం(ఐదు కిలోమీటర్లు)వెళ్ళాలి. చదువు కోసం నేను మా ఇంట్లో నిత్య యుద్ధం చేసేదాన్ని.మా నాన్నకి నన్ను చదివించాలంటే ఇష్టమే కానీ ఉమ్మడి కుటుంబమవ్వడం వల్ల డబ్బులుండేవి కావు.ఏలాగోలా నేను నర్సాపురంలో ఓరియంటల్ స్కూల్లో చేరాను.ఆ స్కూల్లో ఫీజులుండేవి కావు.అద్దేపల్లి సర్వి శెట్టి అనే ఆయన ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా భర్తలు పోయిన వాళ్ళ కోసం ఓ సంస్థను స్థాపించి దానికి హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూలు అని పేరు పెట్టేరు.
విడోస్ కోసం అక్కడ ప్తిమెట్ర్క్,నేత.దాన్సు,సంగీతం లాంటివి నేర్పేవాళ్ళూ.ఆ సంస్థ కిందే మా ఓరియంటల్ స్కూల్ నడిచేది.ఫీజులు లేవు కబట్టి నా చదువు సధ్యమైంది.అయితే రోజూ స్కూల్కి వెళ్ళడం మాకు పెద్ద సంస్యగా ఉండేది.ఇంట్లో వాళ్ళు అసలు పట్టీంచుకునేవారు కాదు. కొన్ని సంవత్సరాలు నడిచే వెళ్ళేవళ్ళం. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెల్లేవాళ్ళం.నేను మెల్లగా సైకిల్ నేర్చుకున్నాను.మగవాళ్ళ సైకిల్ తొక్కేదాన్ని.లంగా,వోణీ వేసుకుని మగాళ్ళ సైకిల్ ఎక్కడం దిగడం చాలా కష్టంగా ఉండేది.మైలు రాళ్ళను చూసుకుని ఎక్కడం దిగడం చేసేదాన్ని.
అలా కష్టాలు పడుతుండగా మా ఉదురింటివాళ్ళ ఆడపిల్లలు నర్సాపురం హైస్కూల్లో చేరారు.వాళ్ళ కోసం వాళ్ళ నాన్న గుర్రం బండీ కొన్నాడు.ఆ బండి నడిపేటాయన పేరు మహెశ్వరం,మేము మామయ్య అని పిలిచేవాళ్ళం.ఆ బండిలో నన్ను మా చిన్నాన్న కూతురు భారతిని తేసుకెళ్ళేట్టుగా భారతి వాళ్ళ తాత ఏర్పాటు చేసాడు.

ఇంకా ఉంది.......

Thursday, July 12, 2007


నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవు

నిప్పుల గుండం లో నడవడానికి, మహత్యాలకి ఏమి సంభంధం లేదన్నది నా అనుభవం.నేను 1980 లో విజయవాడలో జరిగిన ప్రపంచ నాస్తిక మహా సభలల్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిప్పుల మీద నడిచాను. ఎర్రటి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవు.నివిరుగప్పిన నిప్పు కాలుతుంది.తాటాకుతో నిప్పుల గుండాన్ని విసురుతారు.కణ కణలాడే గుండంలో మాత్రమే నడవాలి.చాలా వేగంగా కూడా నడవాలి.మనం నడిచినపుడు ఆ వేడికి అరికాళ్ళలో సన్నటి నీటిపొర ఏర్పడుతుంది.ఆ నీటి పొర కాళ్ళు కాలకుండా కాపాడుతుంది. ఇది విగ్న్ఞానం,సైన్సు కు సంబంధించినది. మహత్యాలకు,మాయలకు సంబంధించినది కాదు.

Tuesday, July 3, 2007



జూ లో పిట్టతో నా చెట్టా పట్టాల్





బ్రహ్మ కమలం/ వెన్నెల పుష్పం

నిన్న అర్ధరాత్రి మళ్ళి మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసింది.మొన్నపూసినప్పుడు మొక్క బయట ఉండడం వల్ల నేను సరిగ్గా గమనించలేదు కాని అబ్బ! ఏమి పరిమళం వెదజల్లిందని.నేను పువ్వు విచ్చుకునేటప్పుడు దాని స్టేజెస్ చూడాలని నా బెడ్రూంలోనే కుండీని పెట్టుకున్నాను.అద్భుతమైన అనుభవాన్ని పొందగలిగాను.ఆ పువ్వు పూయడం,పరిమళాలు వెదజల్లడం మీతొ కూడా పంచుకోవాలని కొన్ని ఫోటోలు పెడుతున్నాను.పరిమాళాలను పంపలేనుకాని ద్రుశ్యాలను పంపగలను.

Saturday, June 30, 2007

మధ్యాహ్నం ముసురు నన్ను ఇంట్లోనే కట్టిపడేసింది.చెయ్యాల్సిన పనులెన్నో ఎదురు చూస్తున్నా అలాగే ధారలుగా కురుస్తున్న వానని చూస్తూ కూర్చున్నాను.చెట్లన్నీ తలారా స్నానాలు చేస్తూ పచ్చగా మెరిసిపోతున్నాయి.సంపెంగ చెట్టు నిండా పూసిన సగం తెలుపు పూలు పరిమాళాలని వెదజల్లుతున్నాయి.నేను వర్షంలో తడుస్తూనే కొన్ని సంపెంగ పూలు కోసుకొచ్చుకున్నాను. నా చుట్టూ కమ్ముకున్న సంపెంగ పరిమళం.
ఇంకొంచం వానలో తడిసి తోటకటు వైపు వెళ్ళాను.అబ్బ!పొగడ పూల చెట్టుకింద నక్ష త్రాల్లా పరుచుకున్న పొగడపూలు.ఆ పూలన్నింటిని ఏరుకొచ్చి సంపెంగల పక్కన పోసాను.నా చుట్టూ ఓ వింతైన పరిమళం.
వర్షపు ధార పరవశం ఒకవైపు,మరో వైపు ఈ పూల పరిమళం .ఈ మధాహ్నం ఇంట్లో ఉన్నందుకు ఎంతో హాయి.

Saturday, June 23, 2007


ఫోనులో… సాంత్వన !
భూమిక జూన్ 2007


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్యాలయానికి పలువురు మహిళలు చేసిన ఫోన్లు చూశాక అలాంటి వారికి సాంత్వనిచ్చి..భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఆ యోచన కార్యరూపం దాల్చింది. ఇప్పటిదాకా పదిహేను వందలకు పైగా కేసులను పరిష్కరించాం’అని వివరించారామె.

ఎలా పనిచేస్తుంది?

భూమిక టోల్‌ఫ్రీ నంబరుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ చేసి కౌన్సెలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఇక్కడ కౌన్సెలర్లుగా ఉన్నారు. ఉదయం ఎనిమిదినుంచి రాత్రి ఎనిమిదింటివరకు ఈ నంబరు సేవలందిస్తుంది. చాలావరకు కేసులకు కౌన్సెలింగ్‌ సరిపోతుందని, నిపుణుల అవసరం ఉన్నప్పుడు మళ్లీ చేయమని చెప్తామని, అవసరమైతే ఇతర కౌన్సెలింగ్‌ కేంద్రాల నంబర్లు, వారి వారి ప్రాంతాల్లో సహాయం అందించగల సంస్థల నంబర్లు కూడా వారికి ఇస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ సేవలందించడానికి కొందరు వృత్తి నిపుణులు కూడా తరచూ వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచీ ఫోన్లు వస్తుంటాయనీ కోస్తా ఆంధ్రా, గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాలనుంచీ వచ్చేవే అధికమన్నారు. ఎక్కువ శాతం కేసులు గృహహింసకు సంబంధించినవేననీ వివరించారు. అయితే గత రెండు నెలలుగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారామె. ఒత్తిడినెదుర్కొంటున్న విద్యార్థినులు, అపరిపక్వ ప్రేమలు వాటి తాలూకు పరిణామాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే వస్తున్నాయని కార్యకర్తలు వివరించారు.

మంచి పని ఇప్పిస్తానని చెప్పిన బ్రోకరుని నమ్మి గోదావరి జిల్లానుంచి మాల్దీవులకు చేరిందో మహిళ. అక్కడికెళ్ళాక తాను మోసపోయానన్న విషయం తెలిసి .ఎలాగో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. తర్వాత ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు సత్యవతి. పాస్‌పోర్టు తదితర పత్రాలేవీ లేకుండా విమానం దిగిన ఆ మహిళను అధికారులు తిరిగి త్రివేండ్రం పంపించేశారు. తెలుగు తప్ప మరో భాషరాని ఆమెను తెలుగు వనితగా గుర్తించి కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థ సత్యవతికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, ఛార్జీలకు డబ్బు పంపి, క్షేమంగా ఇల్లు చేరుకునేలా చేశాం. మరో కేసులో అత్యాచారం చేయబోయిన కన్నతండ్రినుంచి ఇద్దరు కుమార్తెలను కాపాడామన్నారు. ఇలాంటి సీరియస్‌ కేసుల విషయంలో పోలీసు అధికారులు, జిల్లాల్లో న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోనూ సంప్రదించి బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.

హెల్ప్‌లైన్‌లో…



ఫోన్‌ మోగగానే తీస్తారు.
ఫోన్‌ చేసిన స్త్రీ చెప్పేదంతా సహనంతో, సానుభూతితో వింటారు.
వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు.
కేసుని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు తప్ప తీర్పరితనంతో వ్యవహరించరు.
పరిస్థితి మరీ సీరియస్‌గా ఉందనుకుంటే స్థానిక పోలీసు యంత్రాంగం, కుటుంబహింస చట్టానికి సంబంధించిన రక్షణాధికారి, స్వచ్ఛంద సంస్థలవారిని అప్రమత్తం చేస్తారు.
(సలహా, సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 సంప్రదించవచ్చు)

[Source: Eenadu, Vasundhara ; Monday

Monday, June 18, 2007




వెన్నెల పుష్పం

నిన్న అర్ధరాత్రి మా గార్డెన్లో ఓ అద్భుతం జరిగింది.ఈ అద్భుతం గురించి ఇంతకు ముందు విని ఉండడం వల్ల నేను 12 గంటలవరకు మేలుకుని కెమేరాతో సహ కాపు కాసి ఆ పువ్వు విచ్చుకోవడం ఫోటో తీసాను.అద్భుతమైన ఆ పువ్వు కొన్ని గంటలు మాత్రమే ఉండి తెల్లారేపాటికి తొటకూర కాడలా వేలాడిపోయింది. వెన్నెలంత తెల్లగా ఎంతో అందంగా ఉన్న ఆ పువ్వు అంత తొందరగా వాడిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మొక్కను నేను అస్సాంలోని గౌహతి నుంచి తెచ్చి మా గార్డెన్లో వేసాను. వాళ్ళు చెప్పిన పేరు రాత్కి రాణి,రేరాణి అని. నేను మత్రం వెన్నల పుష్పం అని పేరు పేట్టాను. ఈ పువ్వు అసలు పేరు తెలిస్తే ఎవరైనా చెబుతారని బ్లాగ్లో పెట్టాను.

Sunday, June 17, 2007


Opinion: Baby Servants of Baba Logs


By Malvika Kaul

New Delhi,(Women's Feature Service) Every other day I come across the baba-logs and their baby servants. The babas (girls and boys) are barely three or four years old, and their baby servants never more than 10 or 12. Sometimes, the baby servant is carrying the bawling baba, while mamma - usually a young woman who probably hits the gym on the weekends and is a newly-turned vegan - is carrying shopping bags while negotiating her way in a crowded market.
Often, the two young things can be seen in the park, the older one (the help) is keeping a watch on the younger one. And sometimes, I see them in people's kitchens, struggling to boil milk for the screeching baby. Struggling because their small frames barely reach high enough to see whether the milk has boiled, which means they have to wait for it to boil over and then react lightning quick. Surely, all the above activities are illegal - the anti-Child Labour (Prohibition and Regulation) Act came about in 1986. But who cares?

Every year, I see more young families hiring child servants and more children dropping out of school and working for other children. Many are lured into the job by young couples who are very busy and want a playmate for their lonely child. Being a playmate could entail bathing the child, feeding the child whenever required and getting punished if the child gets hurt.

With time, the playmate of the child is transformed into a full-fledged servant - cooking, cleaning, washing and carrying heavy loads - but earning barely half of what an adult domestic help would get. If higher wages are demanded, they get an earful: "What does he (the child) do anyway? He's good for nothing. He botches up everything."

Actually, the child is the youngest employee in the global economy. There is a huge market out there for child servants: NGOs, researchers and recent UN reports would vouch for that. The busy young couples have their reasons: adult maids are a nuisance - they get pregnant too soon or fall in love too often. Adult male servants are a big threat. Children suit them fine. They rarely disobey, and never question. To the smart club of globalised Indians (which also includes people working for NGOs), this is a good investment: the thin line between employment and exploitation is further blurred. The child's labour is never part of the GDP. Yet, his or her labour helps the couple contribute to the GDP.

The poor parents of such children don't see much future in education anyway. Some work themselves and don't want to leave the child alone at home. So they exchange the child's security for slavery.

Some parents, who stay in the villages, and whose children have been trafficked to bigger cities, stay in darkness all their lives. They can never imagine what kind of work their child does in the city homes. Or the kind of abuses the child suffers.

In some cases, baby servants often start as a temporary arrangement. Employers need to check out if their small hands can handle a pressure cooker. Or their still developing brains can remember the 1001 responsibilities of the household. "We give him food, clothing, sometimes I teach him," says a neighbour, who is completely unembarrassed about hiring a child barely four-five years older than her baba.

The neighbour belongs to this fast multiplying club of upwardly mobile young women and men who don't seem to struggle with any guilt of robbing a child of her/his freedom. "What's wrong? The child is secure, gets a much better life than her/his parents can ever afford."

Such arguments were given by my mother's generation, especially by women who were first-generation workers. Although they found hiring children unethical, it was a desperate measure of convenience. This generation always carried the burden of guilt - they rarely showed off their child servant in parties or public places.

But the new lot is different: the child servants go where the baba goes - McDonalds, multiplexes, theme parties, or swimming pools. Some servants look neat and tidy - their clothes are also decent if not smart. Employers prefer them to be young - 9-12 is the ideal age to `train' them.

Gopal, 10, is woken up by 6 am. He cleans his teeth by the drain near the house. His 'rest time' is when he takes the six-year-old baba to play. Gopal is not sure when he will go back home. Someone has to come here to take him back, as he doesn't know his way back to the village. His uncle who brought him to Delhi last came about six months ago to take back his salary.

For his employers, this is a win-win situation. "Children do very well until they are 15 or 16," observes a couple. By the time Gopal is 15, he will be thrown out. If it is a girl, the parents will pull her out of the memsahib's house. In any case, children like Gopal don't have a future. They are out of school for most of their active childhood years. Spending their tender years serving others, leaves them broken and directionless.

And this time, it is not the feudal landlord or the exploitative moneylender who has deprived them of an empowered life. It's the empowered themselves who are disempowering.

Sunday, June 3, 2007


ఒంటరి దీవులు

జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.

Monday, May 28, 2007






చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం
కొండవీటి సత్యవతి



లయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.

పన్నెండున మేం నలుగురం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం ఐదింటికి భద్రాచలం రోడ్‌లో దిగాం. మోహనచంద్ర కూడ మాతో వున్నారు. స్టేషన్‌లో మా కోసం క్వాలిస్‌ సిద్ధంగా వుంది. మేం అయిదుగురం ఎక్కగానే మా వాహనం భద్రాచలం వేపు బయలు దేరింది. కొత్త గూడెం నుండి భద్రాచలం దాదాపు నలభై కిలోమీటర్లుంది. అపుడపుడే తెల తెల వారుతోంది. చెట్లన్నీ మంచు ముసుగే సుకుని వున్నాయి. చల్లటి గాలి హాయిగా ఒళ్ళంతా నిమురుతోంది. పాల్వంచ, వెంటనే కిన్నెరసాని వాగు దాటాం. భద్రాచలంలో పెట్రోలు బంకు దగ్గర ఆయిల్‌ కోసం ఆగినపుడు ఆ బంకు యజమాని మమ్మల్ని వాళ్ళింటిలోకి ఆహ్వానించారు. మేం బ్రష్‌్‌ చేసేసుకుని, కాలకృత్యాల కార్యక్రమం పూర్తి చేసేసాం. పెట్రోలు బంకు చుట్టూ రాశులు పోసిన, ఎర్రటి తివాసీలా ఆరబెట్టిన ఎండుమిర్చి మా కళ్ళను కట్టి పడేసింది. గొంతులో గరగర మంటుంటే కొంచెం తులసి ఆకు కోసుకోవచ్చా అని ఇంటావిడను అడిగినపుడు స్నానాలు కాలేదుగా తెంపొద్దు అని మర్యాదగా చెప్పింది. ఆవిడ మాటల్ని మన్నించి, చెట్టు మీద చెయ్యి వేయకుండా బుద్ధిగా వచ్చి మా బండిలో కూర్చున్నాం. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. తూరుపు దిక్కు ఎర్రబారుతోంది. మేం తిన్నగా తూర్పువేపే వెళుతున్నాం. మహాద్భుతమైన దృశ్యం మా కంటబడింది. ఎర్రటి సూర్యబింబం రోడ్డుకు ఆ చివర మమ్మల్ని రా రామ్మని పిలుస్తూ మాకు దారి చూపిస్తూ మా ముందు పరుగులు తీస్తోంది. తిన్నటి ఆ రోడ్డు మీద మేం కన్నార్పకుండా బింబం వెంట పడి వెర్రి పరుగులు తీసాం. మాకు దిశానిర్దేశం చేస్తూ, దారి చూపిస్తున్న ఆ ఎర్రదనానికి ముగ్ధులమౌతుండగానే దారికిటూ, అటూ విస్తరించిన అడవి, ఆ అడవిలో సూర్యుడి ఎర్రదనంతో పోటీ పడుతూ, ఆకు కూడా కన్పించని మోదుగు పూల రాశులు. అడవి తగలబడుతున్నదా అన్నంత భ్రాంతికి లోను చేసిన మోదుగ చెట్ల నిండా, నిలువల్లా విచ్చుకున్న ఎర్రటి, కాషాయపు రంగు పూలు. మేం ఈ తన్మయత్వంలో మునిగి ఉండగానే మా వాహనం కాటుకపల్లిలో లిడ్స్‌ ఆఫీసు ముందు ఆగింది. ఫాదర్‌, నర్సులు, సిబ్బంది మమ్మల్ని ఆహ్వానించారు. విరగబూసిన వేప చెట్లు, చిరు చేదు వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెట్ల కింద కూర్చుని చాలా మంది పిల్లలు అల్పాహారం ఆరగిస్తున్నారు. నర్సులుండే గదులకెళ్ళి మేం స్నానాదులు పూర్తి చేసి టిఫిన్‌ తిన్నాం.

మా కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని, మీటింగ్‌ మొదలవ్వడానికి ఇంకో రెండు గంటలు పడుతుందని చెప్పారు. బాల కార్మికులుగా వుంటూ మొదటి సారి చదువుకుంటున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఒక తరగతి గదిలో కూర్చుని వున్నారు. రెండు గంటల పాటు వాళ్ళతో మా సంభాషణ కొనసాగింది. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధాపూరిత గాథ. దట్టమైన అడవి లోపలి వాళ్ళ జీవన చిత్రాల్ని ఒకొరి తర్వాత మరొకరు మా ముందు ఆవిష్కరించారు. ఎంతో స్పష్టంగా, స్వచ్ఛంగా మాట్లాడారు. ఆ పిల్లలు తమ బతుకుల్లోని దుఃఖాన్ని విప్పి చెబుతున్నపుడు మా కళ్ళు తడిసిపోయాయి. అరకపట్టి పోడు వ్యవసాయం చేసిన పదేళ్ళ పిల్లవాడి అనుభవం మా గుండెల్ని పిండేసింది. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్‌ ప్రణాళికలు, జీవితంపట్ల వాళ్ళ ఆశావహదృక్పథం మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మా సంభాషణలు ముగింపుకొస్తున్నపుడు ఒక పిల్ల చటుక్కున లేచి నిలబడి, ముత్యాల్లాంటి తన పలువరుస మెరిసిపోతుండగా (అన్నట్లు మర్చిపోయాను మాతో మాట్లాడిన పిల్లలందరి పలువరుసలు మల్లెపువ్వంత తెల్లగా వుండి, సెలయేరంత స్వచ్ఛమైన నవ్వుతో మెరిసిపోయాయి. బుగ్గలు సొట్టలు పడి ముసి ముసి నవ్వుల్ని పూయిస్తున్నపుడు నేను ఆ మాట వాళ్ళకి చెబితే ఎంత సంబరంగా నవ్వారో!!) “మా జీవిత కథలు విన్నారుగా మేడం! మీరు మా కోసం ఏం చెయ్యగలరు?” అని సూటిగా వేసిన ప్రశ్న మా గుండెల్ని తాకింది. మీ గురించి పత్రికలో రాసి మీ సమస్యల గురించి అందరికీ తెలిసేలా చేస్తామని మేం పేలవమైన సమాధానం చెప్పాం. అంతకన్నా ఇంకేం చెప్పలేకపోయాం! ఆ తర్వాత డ్వాక్రా సంఘాల స్త్రీలతో మా సంభాషణ మొదలైంది. అయితే ఈ లోపే వేదిక మీద పాటలు మొదలై మా మాటలు ఒకరికొకరికి వినబడలేదు. మీటింగ్‌ అయ్యాక మాట్లాడుకుందాంలే అనుకుని, వాళ్ళతో కొంత సేపు నృత్యం చేసాం.అప్పటికే చాలామంది స్త్రీలు వచ్చారు.ఇంకా చాలామంది బయలుదేరి వస్తున్నారని, కొండలు దిగి, అడవి లోలోపలి నుండి వస్తున్నారని నిర్వహకులు చెప్పారు. ముఖ్యంగా కోయ, కొండరెడ్డి, గొత్తి కోయ, నాయక్‌ వర్గాలకు చెందిన స్త్రీలు వస్తారని చెప్పారు. ఒంటిగంటకి సభాస్థలి మొత్తం నిండి పోయింది. మోకాళ్ళ వరకు చీరకట్టి, పక్కకొప్పుల్లో పూలు పెట్టిన మహిళలతో ఆ ప్రాంతమంతా కళకళ లాడింది.

సభా కార్యక్రమం మొదలైంది. ఉపన్యాసాల వెల్లువ తక్కువగా వుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా వుండడం ఈ కార్యక్రమంలో విశేషం. సంప్రదాయ గిరిజన నృత్యాలు, లంబాడా నృత్యాలు, గుత్తి కోయ మహిళల నృత్యం ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. వివిధ సామాజిక సమస్యల మీద పిల్లలు వేసిన నాటికలు ఎంతో స్ఫూర్తి దాయకంగా వున్నాయి. బాల కార్మిక వ్యవస్థ మీద, పిల్లల హక్కుల మీద, ఆడపిల్లలు, స్త్రీల అక్రమ రవాణా మీద, హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌ మీద పిల్లలు అద్బుతమైన, నాటికలు ప్రదర్శించారు. వీటన్నింటిని వాళ్ళ స్వంత భాషలో ప్రదర్శించడంతో సభాస్థలి ముందు భాగంలో కూర్చున్న పిల్లలు, వెనుక కూర్చున్న మహిళలు ఎంతో బాగా స్పందించారు. మేము పిల్లల్ని అడిగి అనువాదం చేయించుకున్నాం. సమత, నేను చాలా క్లుప్తంగా ఆ మీటింగ్‌లో మాట్లాడాం.

వివిధ అంశాల మీద పిల్లలు ప్రదర్శించిన నాటికలు ఆయా సమస్యల పట్ల చాలా స్పష్టమైన వైఖరితో, సూటీగా వున్నాయి. అల్లగూడెం నుంచి వచ్చిన జానకి, మాధిగూడెం నుంచి వచ్చిన సావిత్రిలు తమ జీవిత కథనాలు విన్పించారు. నాలుగవు తుండగా సభ ముగింపుకొచ్చింది కాని గిరిజన స్త్రీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పురుషులు ప్రేమ పేరుతో గిరిజన స్త్రీలను వివాహాలు చేసుకుని పిల్లలు పుట్టగానే వదిలేసి వెళ్ళిపోవడం, అలా పుట్టిన పిల్లలు తమ తల్లి కులాన్ని కోల్పోవడం, తండ్రి అగ్రకులానికి చెందితే, వదిలేసి పోయినా సరే ఆ కులమే సంక్రమించడం, దీనివల్ల వారికెదురౌతున్న సమస్యల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ముగిసింది.

ఆ తర్వాత మేం అక్కడ గిరిజన స్త్రీలు ప్రదర్శించిన వివిధ వస్తువుల్ని చూసాం. గిరిజనుల జీవితంలో భాగమైన ఎన్నో వస్తువుల్ని అక్కడ ప్రదర్శించారు. వాటన్నింటిలోకి మమ్మల్ని ముఖ్యంగా నన్ను ఓ వస్తువు విప రీతంగా ఆకర్షించింది. మొసలి కోరలంత పదునుగా వున్న ముళ్ళతో చేసిన ఓ లావుపాటి గాజు. అది చేతికి ధరించి, ఎవరైనా మన మీద దాడి చేస్తే ఒక్క దెబ్బ వేస్తే చాలు అంగుళం మేర శరీరంలోకి దిగిపోతాయి ముళ్ళు. రక్తాలు కారాల్సిందే. దానిని సంపాదించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేసాను. దానిని అమ్మడానికి గాని, ఇవ్వడానికిగానీ వారు అంగీకరించలేదు. దాని ఫోటో తీసుకుని తృప్తి పడి మా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అందరికీ వీడ్కొలు చెప్పి, అద్భుతమైన అనుభవాలను గుండెల్లో దాచుకుని ఐదుగంటలకి మేం భద్రాచలం వేపు బయలు దేరాం. మా రైలు రాత్రి పదిన్నరకి కాబట్టి మధ్యలో భద్రాచలం గుడి, పంచవటి, కిన్నెరసాని ప్రాజెక్టు చూడాలనుకున్నాం. పంచవటికి వెళ్ళి రావడం కష్టమని మా డ్రెవర్‌ భాస్కర్‌ చెప్పడంతో మేం కిన్నెరసాని ప్రాజెక్టు చూద్దామనుకున్నాం. భద్రాచలంలో గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు గుడికెళ్ళారు. నేనూ, సమత గోదావరిని చూస్తూ నర్సాపురంలోని మా వశిష్ట గోదావరిని తలుచుకున్నాం. కిన్నెరసాని ప్రాజెక్టుకి వెళ్ళే ముందే అడవి మధ్యలో ఆగి బోలెడు మోదుగపూలు కోసుకున్నాం.

కిన్నెరసాని చేరేసరికి బాగా చీకటిపడి పోయింది. అదంతా దట్టమైన అడవి ప్రాంతం. గేటు మూసేసారు. వెళ్ళడానికి కుదరదన్నారు గేటు దగ్గర. మేం కాస్త బతిమాలి టికెట్టు పేరుతో యాభై సమర్పించాక మమ్మల్ని లోపలికి వదిలాడు. లోపలంతా నిర్మానుష్యం. కీచురాళ్ళ రొదలోంచి “ఎవరదీ ఈ టైమ్‌లో లోపలికెలా వచ్చారు. వెనక్కి వెళ్ళిపొండి “ అని అరిచారు. దూరంగా లైట్ల వెలుగులో డామ్‌ కన్పిస్తోంది. మేం మళ్ళీ లోపలి వాళ్ళని బతిమాలి డామ్‌ మీది కెళ్ళాం. ‘ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఇలాంటి అడ్వంచర్లు ఇంకెపుడూ చెయ్యకండి’ అని మమ్మల్ని హెచ్చరించి ఫోటోలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ చీకట్లో డామ్‌ మీద ఫోటోలు తీసుకుని బిక్కు బిక్కు మంటూ అక్కడ్నుంచి బయటపడ్డాం. వెలుతురులో చూడాల్సిన అద్భుత ప్రాంతమిది. సుదీర్ఘంగా విస్తరించిన రిజర్వాయర్‌, అందులో మునిగిన కొండ అస్పష్టంగా కన్పడ్డాయి. అంతకు కొద్ది రోజుల ముందు తగలబెట్టిన గెస్ట్‌హౌస్‌ కళావిహీనంగా, నల్లగా నిలిచి వుంది.

మేం కొత్త గూడెం చేరుకుని రైలెక్కడంతో మా అడవి ప్రయాణం ముగింపు కొచ్చింది. నగరంలో జరిగిన అనేక అంతర్జాతీయ మహిళాదినం సమావేశాలకు, ఈ దట్టమైన అడవిలో జరిగిన గిరిజన స్త్రీల సమావేశానికి ఎంతో వ్యత్యాసముంది. స్త్రీల నుండి, పిల్లల నుండి మేం ఎంతో నేర్చుకున్నాం. వారి సమస్యలను అవగాహన చేసుకునే వీలును ఈ సమావేశం కల్పించింది. ఈ అవకాశం మాకు కల్పించిన, గిరిజన స్త్రీల కోసం, పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న లిడ్స్‌ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించిన ఆక్స్‌ఫామ్‌ గిరిజకి, మమ్మల్ని వెంటబెట్టుకు తీసుకెళ్ళిన మోహనచంద్ర గారికి మా కృతజ్ఞతలు. అడవి తల్లికీ దండాలో అంటూ అడవికి ప్రణమిల్లి, అడవి పుత్రికల చైతన్యాన్ని, పిల్లల స్ఫూర్తిదాయకమైన సంభాషణని మా గుండెల్లో భద్రపరుచుకుని మేం మహానగరంలో మళ్ళీ కాలుపెట్టాం.
మా వేసవి శిబిరం ముగించాలంటే నాకు చాలా బాధగా ఉంది.పిల్లలు బాగా అలవాటయ్యారు.చక్కగా పాడతారు.నేను ఈ మధ్య భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను.అక్కడ గిరిజన మహిళలు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సమావేశానికి నన్ను పిలిచారు.భద్రాచలానికి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో అడవి లోలోపలికి వెళ్ళాము. అదో అద్భుతమైన అనుభవం.ఈ ప్రయాణపు రిపోర్ట్ చదవాలనుకుంటే భూమిక ఏప్రిల్ సంచిక చూడగలరు.ఆ సమావేశంలో మేము చాలా మంది గిరిజన బాల బాలికలతో సంభాషించాము. వారి ఆశలు, ఆశయాలు, కలలు,కోరికలు మాతో మనసు విప్పి చెప్పుకున్నారు.ఆ వివరాలన్ని ఆ రిపోర్టులో ఉన్నాయి. పిల్లలతో గడపడం, వారితో ముచ్చటించడం చక్కటి అనుభవాన్ని ఇస్తాయి.మనం కొంచం ఓపికతో వాళ్ళు చెప్పేది వింటే ఎన్నో సంగతులు చెబుతారు.ఆ గిరిజన పిల్లలతో గడపడం ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో మళ్ళి సమ్మర్ కాంపులో ఈ పిల్లలు అంతే ఉత్సాహాన్ని పంచారు.వాళ్ళతో కలిసి ఆడడం, పాడడం, వాళ్ళకి మనకి తెలిసినవన్ని నేర్పడం చాలా చాలా బావుంది.వాళ్ళకి రోజుకో వెరైటి పండ్లు,స్వీట్లు,చాకలెట్లు,బిస్కెట్టులు పంచుతున్నాం. అందులో కూడ ఎంతో త్రుప్తి దాగి ఉంటుంది.
మా సమ్మర్ కాంపులో ముగ్గురి పుట్టిన రోజులు సెలబ్రేట్ చేసాం.
ఈ కాంపు ను నిర్వహించడంలో చాలా మంది మిత్రులు సహకరించారు.యద్దనపూడి సులోచనా రాణీ గారు,డా.సునంద, డా. వహీదా,విష్ణు ప్రియ గారు,కే బి లక్ష్మి, భార్గవి ఇలా ఎందరో మిత్రులు తమ సమయాన్నిచ్చికొందరు,ఆర్ధిక సహకారాన్ని అందించి కొందరు తోడ్పడ్డారు.వారందరికి క్రుతజ్ఞతలు.
నిజంగా మనం మనసుపెట్టి,నిబద్ధతతో ఏమైనా చెయ్యదలుచుకుంటే, మనం ఒక అడుగు ముందుకేస్తే ఎన్నో చేతులు మనకు సహకరిస్తాయి.ఇది నా అనుభవం.ఇరవై రోజులకి ముందు ఈ పిల్లలెవరో కూడా నాకు తెలియదు.కాని ఇప్పుడు వీళ్ళంతా నాకు ఆత్మీయులు.ఆందుకే క్యాంపు ముగించాలంటే దుఖమొస్తోంది నాకు.

Sunday, May 27, 2007






వేసవి శిబిరం ఫోటోలు మరికొన్ని
వేసవి శిబిరం ఫోటోలు




నేను మరి కొంత మంది మిత్రులు కలిసి మే10 నుండి బేగుంపేట్ లోని మక్తా అనే ప్రాంతంలో పిల్లలకోసం ఒక వేసవి సిబిరం నడుపుతున్నామని ఇంతకు ముందు మీకు తెలియచేసాను.జూన్ 2న ఆ శిబిరాన్ని ముగించాలనుకుంటున్నాం. ఎందుకంటే జూన్ మొదటి వారంలోనే కొన్ని పాఠశాలలు రీఓపన్ కాబోతున్నాయి. ఈ వేసవి సిబిరం నడపడం నాకో అద్భుతమైన అనుభవం.30 మంది పిల్లల్ల్ని పోగేసి ఆటలు,పాటలు న్రుత్యాలు,డ్రాయింగ్ నేర్పించడం, వాళ్ళతో కలిసి ఆడడం, ఎగరడం అన్నీ చక్కని అనుభవాలే. మామూలుగా అయితే ఈ పిల్లలు సమ్మర్ కాంపులకు వెళ్ళగలిగిన వారు కాదు. మేము అనుకోకుండా ఈ కాంపు పెట్టడం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగించింది.వాళ్ళ సంతోషం మాకు ఎంతో త్రుప్తినిచ్చింది.ఈ కాంపు లో పాల్గొన్న పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో మేము చెప్పినవన్నీ నేర్చుకున్నారు.అద్భుతమైన బొమ్మలేసారు.రధాలు తయారు చేసారు.వాటిని చక్కగా అలంకరించారు.మీకోసం కొన్ని ఫోటోలు ఇవిగో.

ఇంకా ఉంది.....

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...