Monday, July 16, 2007

మిగిలిన భాగం

అలా మేము గుర్రం బండీ మీద కొంత కాలం స్కూలుకి వెళ్ళేం.మహేశ్వరం మావయ్య పూలరంగడిలా సెంట్లు పూసుకుని హుషారుగా ఉండేవాడు.అతను తన భార్యతో కాక కాలవ గట్టు మీద వేరే ఇంట్లో ఉండేవాడు.ఆ వేరే ఆమెని బీబమ్మ అనేవాళ్ళు. ముస్లిం స్త్రీ అన్నమాట.మహేశ్వరం మావయ్య తన ఇంట్లో తన భార్యతో కాక బీబమ్మతో ఎందుకుండేవాడో అర్ధమయ్యే వయసు కాదు. కానీ హుషారుగ బండి నడపడం,మమ్మల్ని బండి లో ఎక్కించుకోవడం,మళ్ళి జాగ్రత్తగా తీసుకురావడంతో అతనంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది.అతను తన భార్యను పట్టించుకోకపోవడమే కాక బాగా కొట్టేవాడని చెప్పుకునేవారు.ఇప్పుడు తలచుకుంటే అతనంటే అసహ్యంగా అనిపిస్తుంది కానినా చదువు కొనసాగడంలో,చదువు నా జీవితంలో తెచ్చిన మార్పులో అతని పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా ఒప్పుకుంటాను.ఆ గుర్రం బండి, మహేశ్వరం మవయ్య అంటే అందుకే ఒకలాంటి అభిమానం.ఆడవాళ్ళ పట్ల జరిగే అమానుషాలు,దుర్మార్గాలూఎలా ఉంటాయో వాటి స్వరూపం ఆ రోజుల్లో అర్ధమై ఉంటే నేనతని బండి ఎక్కేదాన్ని కాదు.
ఓ సారి మా బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది.నాకేమీ దెబ్బలు తగల్లేదు కానీ భారతి స్ప్రుహ తప్పి పడిపోయింది.మా పుస్తకాలన్నీ నీళ్ళల్లో పడిపోయాయి.
చాలా రోజులవరకు మాకు పుస్తకాలు దొరకలేదు. "హిందు" లో మ్యూజింగ్స్ చదవగానే నాకిదంతా గుర్తుకొచ్చింది.దాదాపు నలభై ఏళ్ళనాటి మాట.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...