Monday, May 28, 2007

మా వేసవి శిబిరం ముగించాలంటే నాకు చాలా బాధగా ఉంది.పిల్లలు బాగా అలవాటయ్యారు.చక్కగా పాడతారు.నేను ఈ మధ్య భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను.అక్కడ గిరిజన మహిళలు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సమావేశానికి నన్ను పిలిచారు.భద్రాచలానికి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో అడవి లోలోపలికి వెళ్ళాము. అదో అద్భుతమైన అనుభవం.ఈ ప్రయాణపు రిపోర్ట్ చదవాలనుకుంటే భూమిక ఏప్రిల్ సంచిక చూడగలరు.ఆ సమావేశంలో మేము చాలా మంది గిరిజన బాల బాలికలతో సంభాషించాము. వారి ఆశలు, ఆశయాలు, కలలు,కోరికలు మాతో మనసు విప్పి చెప్పుకున్నారు.ఆ వివరాలన్ని ఆ రిపోర్టులో ఉన్నాయి. పిల్లలతో గడపడం, వారితో ముచ్చటించడం చక్కటి అనుభవాన్ని ఇస్తాయి.మనం కొంచం ఓపికతో వాళ్ళు చెప్పేది వింటే ఎన్నో సంగతులు చెబుతారు.ఆ గిరిజన పిల్లలతో గడపడం ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో మళ్ళి సమ్మర్ కాంపులో ఈ పిల్లలు అంతే ఉత్సాహాన్ని పంచారు.వాళ్ళతో కలిసి ఆడడం, పాడడం, వాళ్ళకి మనకి తెలిసినవన్ని నేర్పడం చాలా చాలా బావుంది.వాళ్ళకి రోజుకో వెరైటి పండ్లు,స్వీట్లు,చాకలెట్లు,బిస్కెట్టులు పంచుతున్నాం. అందులో కూడ ఎంతో త్రుప్తి దాగి ఉంటుంది.
మా సమ్మర్ కాంపులో ముగ్గురి పుట్టిన రోజులు సెలబ్రేట్ చేసాం.
ఈ కాంపు ను నిర్వహించడంలో చాలా మంది మిత్రులు సహకరించారు.యద్దనపూడి సులోచనా రాణీ గారు,డా.సునంద, డా. వహీదా,విష్ణు ప్రియ గారు,కే బి లక్ష్మి, భార్గవి ఇలా ఎందరో మిత్రులు తమ సమయాన్నిచ్చికొందరు,ఆర్ధిక సహకారాన్ని అందించి కొందరు తోడ్పడ్డారు.వారందరికి క్రుతజ్ఞతలు.
నిజంగా మనం మనసుపెట్టి,నిబద్ధతతో ఏమైనా చెయ్యదలుచుకుంటే, మనం ఒక అడుగు ముందుకేస్తే ఎన్నో చేతులు మనకు సహకరిస్తాయి.ఇది నా అనుభవం.ఇరవై రోజులకి ముందు ఈ పిల్లలెవరో కూడా నాకు తెలియదు.కాని ఇప్పుడు వీళ్ళంతా నాకు ఆత్మీయులు.ఆందుకే క్యాంపు ముగించాలంటే దుఖమొస్తోంది నాకు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...