Thursday, January 19, 2012
Monday, January 9, 2012
వృద్ధుల కోసం మా కొత్త కార్యక్రమం.
| పడకండ్ల గ్రామంలో ఉన్న వందల ఏళ్ళ నాటి చింత చెట్టు |
| ఫకీరమ్మతో నా సహచరడు. |
| ఫకీరమ్మ |
| జమ్మి చెట్టు |
| పడకండ్ల గ్రామం. |
ఇంతకు ముందే మేమొక ట్రస్ట్ ఏర్పాటు చేసాం.
ఈ ట్రస్ట్ గ్రామాల్లో ఉన్న వృద్ధుల కోసం మొదలు పెట్టాం.
ఈ రోజు పడకండ్ల అనే గ్రామం లో మా పని ప్రారంభిచాం.
కర్నూలు జిల్లా అహోబిలానికి దగ్గరుండే పడకండ్ల గ్రామాన్ని మొదటిదిగా ఎంచుకున్నాం.
ఈమె పేరు ఫకీరమ్మ.80 సంవత్సరాలు.ఒంటరి మహిళ.ఇంకా పొలాలకెళ్ళి కూలి చేస్తూ బతుకుతోంది.
ఈమె గారే మా మొదటి అతిధి.
గ్రామం లో ని ఒక స్వచ్చంద కార్యకర్త మా తరఫున ఆమెకు ఇక నుండి భోజనం పెడతాడు.
మేము అతనికి డబ్బు చెల్లిస్తాం.
కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడున్న 60 ఏండ్లు దాటిన వృద్ధులకు ఆహారం,వైద్య సహాయం చెయ్యాలనేది మా సంకల్పం.
Wednesday, January 4, 2012
ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటం – ఇందిరా గోస్వామి
2002 మార్చి నెలలో ఇందిరా గోస్వామి హైదరాబాదు వచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి రచయిత్రుల మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇందిర ఆ రోజు ఎంతో ఉద్వేగభరితమైన ఉపన్యాసం ఇచ్చారు. నేను, కొండేపూడి నిర్మల ఆవిడను ఇంటర్వ్యూ చెయ్యడానికి లేక్వ్యూ గెస్ట్ హౌస్కి వెళ్ళినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఉత్సాహంగా నవ్వుతూ మాతో దాదాపు గంటసేపు గడిపారు.
నవంబరు 29న ఇందిరా గోస్వామి మరణించారని విన్నపుడు చాలా బాధేసింది. 69 సంవత్సరాలకే ఆమె తుదిశ్వాస వీడడం ఒక్క అస్సామ్ రాష్ట్రానికే కాక యావత్ దేశానికి ఎంతో విషాదకరమైన అంశం. ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటంలా ఆమె అత్యంత విషాదంలోంచి తేరుకుని, భారతదేశం గర్వించదగ్గ రచయిత్రిలా ఎదిగిన తీరు మరుపురానిది. ఆత్మహత్యకు ప్రయత్నించిన నేపథ్యంలోంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంటూ అత్యద్భుతమైన రచనల్ని అందించింది. మైమోన్ రాయసం పేరుతో అస్సామ్ అంతటా ప్రసిద్ధురాలైన ఇందిర అస్సామీయులకు పెద్దక్క. వేర్పాటు వాద ఉద్యమాన్ని నడుపుతున్న ఉల్ఫా ఉద్యమకారులతో శాంతి చర్చలకు శ్రీకారం చుట్టిన సాహసి ఆమె.
తాను ఎంతో ప్రేమించిన భర్త మాధవన్ రాయసం అయ్యంగార్ కాశ్మీరులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినపుడు ఆమె కుప్పకూలిపోయింది. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అంత దు:ఖంలోంచి ఆమెను బయట పడవేసింది ఆమె రచనలే. ఆ రచనల నిండా పొంగేేది స్త్రీల దు:ఖమే. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల దారుణ ఊచకోత నేపథ్యంగా వచ్చిన నవల చదివినపుడు అందులోని సంఘటనలు రోజుల తరబడి మనల్ని వెంటాడుతాయి. ఆమె స్వయంగా ఆ దుర్ఘటనలు జరిగిన ప్రాంతాలని సందర్శించి భర్తల్ని కోల్పోయి హృదయ విదారకంగా సామూహికంగా విలపిస్తున్న వందలాది స్త్రీలని కళ్ళారా చూసి చలించిపోయింది. ”నా జీవితంలో ఇంతమంది విధవలు ఒకేచోట సామూహికంగా ఏడ్వడం ఎప్పుడూ చూడలేదు. ఆ దృశ్యాలను చూడడం ఎంతో బాధాకరం” అంటుంది ఒక ఇంటర్వ్యూలో.
అన్నింటిని మించి భారతీయ సమకాలీన సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే నవల ”నీల్కాంత్ బ్రజ”. తాను వైధవ్యం పొందిన తొలి రోజుల్లోనే తన దు:ఖాన్ని మోస్తూనే ఆమె ”బృందావనం” లో నివసించే భర్తృహీనుల దయనీయ స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి కొంతకాలం వారితో కలిసి బతికింది. ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో ఒక విధవతో కలిసివుంటూ వారి స్థితిగతుల్ని అధ్యయనం చేసి, హిందూ సమాజం విధవల్ని ఎంత భయానకంగా, కిరాతకంగా దోచుకుంటుందో అణిచి వేస్తుందో వర్ణిస్తూ రాసిన పుస్తకం ”నీల్ కాంత్ బ్రజ”. ఇందిరా గోస్వామి రచనల నిండా అంతర్లీనంగా ప్రవహించేది ఈ దేశంలోని ఆడపిల్లల, ఆడవాళ్ళ దు:ఖం, వివక్ష, అణిచివేతలే. అస్సాం అంతటా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆమె ఆత్మ కథాత్మక కథనం ”ఆధాలేఖా దస్తావేజ్” (జుదీ తిదీతీరిదీరిరీనీలిఖి జుతిశిళిలీరిళివీజీబిచీనీగి) ని 1988లో రాసింది. భర్త హఠాన్మరణంతో తాను ఎలా మానసికంగా కుంగిపోయిందో, ప్రతి రాత్రి నిద్రమాత్రలు మింగినా నిద్రపట్టని స్థితి గురించి, అవే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో మింగి రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషాదం గురించి తన ఆత్మకథలో వివరంగా రాసింది. తన మన: శరీరాలను కుంగతీసిన డిప్రెషన్ నుంచి తనని బయట పడవేసింది తన సాహిత్య సృజనేనని, తన పోరాటం గురించి ఆత్మకథలో రికార్డు చేసిన ఇందిరా గోస్వామి జీవితం అస్సామీయులకు తెరిచిన పుస్తకమే. బహుళ ప్రచారం పొందిన ఒక జానపదకథలా ఇందిర జీవిత కథ అస్సామ్ ప్రజల మనసుల్లోకి ఇంకిపోయింది.
2004 సంవత్సరంలో గౌహతిలో ”ధేమాజి” అనే ప్రాంతంలో సంభవించిన పేలుళ్ళు, స్వాతంత్య్ర దినోత్సవాన ఒక పాఠశాల మీద ఉల్ఫా ఉద్యమకారులు బాంబుదాడులకు పాల్పడడం, ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇందిరను కలిచివేసింది. ఆ దుర్ఘటనలో ఒలికిన రక్తం, జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలు ఆమెలో తీవ్రమైన సంఘర్షణను రేపాయి. ఏర్పాటువాద ఉద్యమాలు అంతమవ్వాలని, దారితప్పిన అస్సామీ యువతను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తేవాలని ఆమె చాలా తపనపడింది. వేర్పాటు వాదులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రక్రియకు తెరతీసింది. అదే సమయంలో 2007లో ఆమెకు తొలిసారి సెరిబ్రల్ హెమరేజ్ అయ్యింది. మెల్లగా కోలుకుని, తిరిగి తన రచనల మీదికి దృష్టి సారించింది. ఆమె చిట్టచివరి నవల రాసింది. ఈ నవల కథానాయకి, బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడిన ఒక బోడో మహిళ. 2007 లో వచ్చిన స్ట్రోక్ క్రమంగా ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపింది. ఆమె ఎంతో ఉత్సాహంగా పబ్లిక్లైఫ్లో వుంటున్నప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తూవచ్చింది. అంతిమశ్వాస వరకు ఆమె ఏం చెప్పినా అస్సాం ప్రజలు అత్యంత ప్రేమతో విన్నారు. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినపుడు, గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ జనప్రవాహమైంది. రాజకీయ నాయకులు, సాహిత్యకారులు, సామాన్య ప్రజలతో ఆ ప్రాంతం కిటకిటలాడి పోయింది. ఆమె కోసం దేశమంతా ప్రార్థనలు జరిగాయి. ఇంటర్నెట్లో మెసేజ్లు సర్క్యులేట్ అయ్యాయి. హాస్పిటల్ ఆవరణలో వేలాదిగా ఆవనూనె దీపాలను వెలిగించి, ఆమె పట్ల తమ ప్రేమను చాటుకున్నారు అస్సామీయులు.
బహుశా ఇంతటి ప్రజాదరణ పొందిన రచయిత్రి భారతీయ సాహిత్యంలోనే కాక ప్రపంచ సాహిత్యంలో కూడా చాలా అరుదుగా కనబడతారు. తామెంతో ప్రేమించిన తమ పెద్దక్క మరణం అస్సామీయులను ఎంతో వ్యథకు గురిచేసి వుంటుంది. 1942 నవంబరు నెలలో పుట్టిన ఇందిరా గోస్వామి మరణం కూడా నవంబరులోనే సంభవించింది. భూమిక కుటుంబం మొత్తం ఇందిరా గోస్వామికి హృదయ పూర్వక నివాళులు అర్పిస్తూ, ఆమె ఇంటర్వ్యూను పాఠకుల కోసం పున:ప్రచురిస్తున్నాం. కమలాదాస్ తర్వాత నాకు అత్యంత ఆత్మీయురాలు ఇందిరా గోస్వామి గురించి ఈ నాలుగు మాటలు రాయాలన్పించింది. ఆమె కీర్తి, ఆమె ముద్ర భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
Sunday, January 1, 2012
Saturday, December 31, 2011
పొగడపూల తో నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.
ఈ కళాత్మక గుచ్చ్హాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిస్తుంది.
నా దృష్టిలో ఆనందం మన చుట్టూనే ఉంటుంది.దాన్ని ఒడిశి పట్టుకొవడం ఇదిగో ఇలాగే.
శుభాకాంక్షలతో
మీ
సత్యవతి
Friday, December 30, 2011
శుభాకాంక్షలు.
ఉత్తరం
పుస్తకం
ప్రియ నేస్తం సాన్నిహిత్యం
చెట్టు చేమ
చుట్టూ నీళ్ళు
చూపు ఆనినంత మేరా పచ్చదనం
ఎత్తైన కొండలూ
ఎరుపెక్కిన తూరుపు దిక్కు
ఎప్పుడూ నవ్వే పెదవులు
ఏదైతే ఏమిటిలే అంటూ
నల్లేరు మీద బండిలా నడిచిపోయే జీవితం
ఎవరో వస్తారు ఏదో చేస్తారు లాంటి ఉదాసీనతలకు
బై బై చెప్పేసి
నువ్వే ఒక ఉద్యమం
నువ్వేఒక మార్పు సంకేతం
నూతన సంవత్సరాన ఇదే నా సందేశం
ఇవే నా శుభాకాంక్షలు.
Thursday, December 29, 2011
ప్రేమలేఖ
అబ్బాయి రాస్తే
అందమైన మోము,అద్దాల్లాంటి చెక్కిళ్ళు,
సిం హ మధ్యమం లాంటి నడుము
నిగనిగలాడే నీలి కురులు
మేలిమి బంగారులాంటి మేని చాయ
అమ్మాయి రాస్తే
ఆరడుగుల అందం ,ఆజానుబాహువులు
గిరజాల జుట్టు,సన్నని మీసకట్టు
ప్రేమలేఖల్లొ ఉండేదంతా శరీర వర్ణనేనా?
శరీరాల స్పృహమాత్రమేనా?
ఆశయాలు,ఆదర్శాలు
మనసులోతులు,మానవీయ కోణాలు
ఆత్మ గౌరవాలు,సహజీవన సౌరభాలు,
ఇవేవీ లేకుండా ప్రేమలేఖా?
పూల మధ్య దారం ఇమిడిపోయినట్టు
ఆత్మిక బంధంలొ శరీరాల కలయిక ఉండాలి
ప్రేమలేఖల్లో పూల పరిమళాలు గుబాళించాలి
అంతరంగాలు ఆవిష్కృతమవ్వాలి.
లేఖ అంటేనే ప్రేమ సువాసనల్నో,
స్నేహ సువాసనల్నో మోసుకొచ్చేది.
అలాంటి లేఖ ప్రేమని మోసుకొస్తే....
మొగలి పొత్తులో పొదివినట్టు
మల్లెపూల మధ్యలో అమరినట్టు
గరికపువ్వు మీద తుషారబిందువట్టు
ప్రేమలేఖ
ప్రియమైన లేఖ
Tuesday, December 27, 2011
Wednesday, December 14, 2011
“Breaking the Conspiracy of Silence behind voilence against women and girl children
Today more than 1000 school and college children attended this function.
we from Bhumika mobilized some funds and distributed sweets,biscuits,water and fruity.
all the students belongs to Govt. schools and colleges.
the meeting went well.
children performed so many cultural programes.
we are so happy to observe that children made so many posters on WHAT IS GOOD TOUCH AND WHAT IS BAD TOUCH.
A campaign on “Breaking the Conspiracy of Silence” was initiated in about 100 schools and colleges in Hyderabad, Secunderabad and Rangareddy districts from 25th to 10th December. The major objectives of the campaign are: building solidarity, dissemination of information and sensitization of larger sections of the society, particularly men on the need to break silence and more particularly the conspiracy behind the silence with regard to increasing crime rate of violence on women and girls. The target group for this rally would be adolescent girls and boys with focus on violence and abuse in schools & colleges.
Monday, December 12, 2011
“Breaking the Conspiracy of Silence”
Dear All
A campaign on “Breaking the Conspiracy of Silence” was initiated in
about 100 schools and colleges in Hyderabad, Secunderabad and Rangareddy
districts from 25th to 10th December. The major objectives of the
campaign are: building solidarity, dissemination of information and
sensitization of larger sections of the society, particularly men on the
need to break silence and more particularly the conspiracy behind the
silence with regard to increasing crime rate of violence on women and
girls. The target group for this rally would be adolescent girls and
boys with focus on violence and abuse in schools & colleges.
The campaign is a joint effort of different NGOs and network groups working on women and girls’ rights in twin cities of Hyderabad and Secunderabad and facilitated by Samatha Gender Resource Centre, a unit of Andhra Pradesh Mahila Samatha Society.
In this regard, we are happy to
invite you cordially to the public meeting on 14th December at
Harihara Kala Bhavan where the experiences and demands from the children
that came up in this campaign will be presented and discussions will
take place on future steps.
Venue: Harihara Kala Bhavan,
Secunderabad
Coordination
Committee
Date: 14. 12. 2011
Time: 2.00 to 5.30 Pm
contact person:
kondaveeti satyavati
9618771565
Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
ప్రపంచాన్ని స్త్రీల దృష్టి కోణం నుంచి చూడమంటాను పురుషులు లేని ప్రపంచాన్ని నేను కోరడం లేదు ఆడపిల్లలు అన్నింటిని ఆఖరికి ప్రాణాన్ని సైతం కోల్...
