Sunday, August 29, 2010

ఇరవై నాలుగు గంటలు--ఇరవై వ్యాపకాలు

నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ రోజు తొమ్మిది వరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో నేను చేసిన పనులు ఒక సారి గుర్తు తెచ్చుకుందామని కూర్చున్నాను.
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను.జొన్న రొట్టె తినేసి ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటూ గడిపేద్దామనుకుంటున్న వేళ ఫ్రెండ్ కూతురు ఫోన్ చేసి అమ్మ మీ కోసం చూస్తోంది.ఇంటికొస్తానన్నారట కదా.తను ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చి స్నానం చేస్తోంది అంది.
టైం చూసాను.8.30.బేగంపేట నుండి అంబర్ పేట కి ట్రాఫిక్ లో కారు నడుపుకుంటూ వెళ్ళడం కష్టమే.
గీతతో తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుని చాలా కాలమైంది.అంతే. వెంటనే తయారై అంబర్ పేటకి పయనమై పొయాను.అర్ధ రాత్రి వరకు అంతులేని కబుర్లు సాగాయి.
హెల్ప్ లైన్ కి వస్తున్న కేసుల గురించి,ఏ చిన్న విషయాన్ని పరిష్కరిచుకోలేక సతమత మౌతున్న వైనాన్ని గురించి చాలా సేపు మాట్లడుకున్నాం.ఒంటిగంటకేమో పడుకున్నాం.
ఉదయమే ఏడింటికి లేచి ఇంటికొచ్చాను.
ఎనిమిదిన్నరకి ఈటివి 2 కి వెళ్ళాలి.లీగల సర్వీసెస్ అధారిటి వారు నివహిస్తున్న
"అందరికి అందుబాటులో న్యాయం"లైవ్ ప్రోగ్రాం లో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నాను.వరకట్న హత్యలు,వేధింపులు అనే అంశం మీద ఫోన్ ఇన్ లతో సహా చర్చ నడిచింది.పదిన్నరకి ఇది ముగిసింది.
స్తూడియో నుండే బంజారాహిల్ల్స్ వెళ్ళాను.బెంగుళూరు నండి కవల పిల్లలతో మరో ఫ్రెండ్ వచ్చింది.ఓ రెండు గంటలు పిల్లలతో ఆడడం గొప్ప అనుభవానంచ్చింది.ఇద్దరూ నా ముక్కుపట్టి లగుతూ చెవుల్ని గుంగుతూ ఒకటే ఆటలు.అక్కడే తిడి తినేసి,వుమన్ ప్రొటక్షన్ చెల్ లో ఉన్న సపోర్ట్ సెంటర్కి వెళ్ళాను.సెంటర్లో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియని పర్యవేక్షించి ఆఫీసుకి వెళ్ళాను.
హెల్ప్ లైన్ కి వచ్చిన కాల్స్ గురించి,క్రిటికల్ కేసుల గురించి కౌంచిలర్ ని అడిగి తెలుసుకున్నాను. ఈ లోగా లోక్ సత్తా కార్యాలయం నుండి కల్ల్ వచ్చింది.ఒక సీరియనుంచి ఫోన్ వచ్చింది.ఒక సీరియస్ కేసు ఉందని, వాళ్ళు నాతోనే మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు.హెల్ప్లైన్ కి కాల్ చెయ్యమన్న చెయ్యకుండా నేరుగా ఆఫీసుకి వచ్చారు.రెడు గంటలకు పైగానీ వాళ్లతో మాట్లాడాల్సి వచింది.ఒంఘోలులో ఒకమ్మాయిని రక్షించాల్సి ఉంది.అవన్నీ ప్లాన్ చేసి వాళ్ళని పంపించేసినాను.
నాలుగింటికి భూమిక సెప్టంబర్ సంచిక పని చూసుకుటూ కూర్చున్నాను.
ఇఎదున్నరకి బషీర్బఘ్ లోని ప్రెస్ చ్లబ్ కి బయలుదేరా.
ఆరు గంటలకి గొర్రెపాటి నరేంద్రనాధ్ మెమోరీల్ లెక్చర్ సమావేశం ఉంది.ప్రొఫెసర్ శివ విశ్వనాధన్ చాలా అద్భుతమైన లెక్చర్ ఇచ్చారు.ఆయన ఉపన్యాసం మెదడులో ఏవో కొత్త కోణాలని తెరిచింది.తొమ్మిదిగంటలకి మీటింగ్ ముగిసింది.ఈ మీటింగ్లో పడి తిండి సంగతి ఇంట్లో చెప్పడం మర్చిపోయాను,.వస్తూ వన్స్తూ.ఓహిరిస్ కి వెళ్ళి చికెన్ కబాబ్స్,తండూరి రోటి పాక్ చేయించుకుని ఇంటికొచ్చాను.
అలిసిపోయి మంచానికి అడ్డం పడితే కళ్ళు మూతలు పడిపోతుంటే గత ఇరవై నాలుగ్గంటలు కళ్ళ ముందు కనబడ్డాయ్.చేసిన పనులు చేపట్టిన కార్యక్రమాలు గుర్తొచ్చి తృప్తిగా,హాయిగా నిద్రపోయా.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...