Sunday, October 9, 2011

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం













మొన్ననే కదా అమర్ నాధ్ కి వెళ్ళొచ్చాను.
ఇంత వెంటనే మళ్ళీ హిమాలయాల్లోకి వెళతాననుకోలేదు కానీ వెళ్ళొచ్చేసాను.
అమర్ నాధ్ లో సింధు ఆవహిస్తే ఈ ప్రయాణంలో గంగమ్మ ముంచెత్తింది.
ఓకటా రెండా ఎన్నెన్ని నదుల్ని కలుపుకుంటూ గంగ ప్రవహిస్తుందో దాదాపు ఆ అన్ని ప్రదేశాల్ని ఓ ఐదు రోజులు సుడిగాలిలా చుట్టేసి వచ్చాను.బద్రీనాధ్ లో అలకనందని ,కేదార్నాధ్ లో మందాకినినీ,
రుద్రప్రయాగలో మందాకిని,అలకనంద సంగమాన్ని,
దేవప్రయాగలో అలకనంద,భద్రావతి నదుల సంగమాన్ని,
దేవప్రయాగ నుండి అఖండ గంగ  రిషీకేశ్ ,హరిద్వార్ మీదుగా వారణాశి కి పయనమవ్వడం
అన్నింటినీ హాయిగా చూసేసి వచ్చాను.
ఓ రోజంతా అలకనంద తో చెట్టాపట్టాలేసుకుని బద్రీనాధ్ కి వెళ్ళడం,
మర్రోజు మందాకిని తో మనసు పెనవేసుకుకి కేదార్నాధ్ కి వెళ్ళడం
ఓ గొప్ప అనుభవం.
గంగ చుట్టూ అల్లుకున్న హిమవత్ శిఖరాలు,
కాదు కాదు గంగమ్మని సృష్టించిన హిమాలయాల మహోత్తుంగ శిఖర సముదాయాలు
నాకు ఇంకేం కావాలి?
నదులూ, మంచు కమ్మిన మహా పర్వతాలూ,పచ్చటి అడవులూ......వాటి పక్కనే ఐదు రోజుల మా ప్రయాణం  
బతుకు ధన్యమైన   సందర్భం.
మీ కోసం కొన్ని ఫోటోలు.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...